News March 29, 2025
వరంగల్: చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్!

చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్ వస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన రాములు అనే వ్యక్తి పీఆర్ శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. 2012లో రాములు చనిపోయారు. ఆయన స్థానంలో అదే పేరు, తండ్రి పేరు, ఊరి పేరు ఒకటే ఉన్న మరో వ్యక్తిపై ప్రతీ ఏటా లైఫ్ సర్టిఫికెట్ తీస్తున్నట్లు తెలిసింది. బతికి ఉన్న రాములుకు ఆసరా పెన్షన్ రాకపోవడంతో అసలు విషయం బయటపడినట్లు సమాచారం.
Similar News
News February 28, 2026
భారత్ సెమీస్కు వెళ్లదు, పాక్ వెళ్తుంది: అమీర్

పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ <<19191335>>మరోసారి<<>> టీమ్ ఇండియాపై విషం కక్కారు. ‘గతంలో నేను చెప్పిన మాటమీదే నిలబడి ఉన్నా. భారత్ సెమీఫైనల్కు వెళ్లదు. వెస్టిండీస్పై ఓడిపోతుంది. పాకిస్థాన్ శ్రీలంకను ఓడించి సెమీఫైనల్లో అడుగుపెడుతుంది. మేం సెమీస్లో గెలిస్తే కొలంబోలో ఫైనల్ కూడా ఆడతాం’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మరి పాకిస్థాన్ సెమీస్ వెళ్తుందా? కామెంట్ చేయండి.
News February 28, 2026
జడ్చర్ల: పుట్టెడు దుఃఖంలో ఆ కుటుంబం.. దొంగల నిలువు దోపిడీ

జడ్చర్ల మండలం మల్లేబోయిన్పల్లికి చెందిన లక్ష్మి భర్త ఇటీవల చనిపోవడంతో దేవుని వద్ద నిద్ర చేసేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. లక్ష నగదు, 8 తులాల బంగారం, కిలో వెండి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఇంటి పెద్ద మృతితో దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఈ చోరీ తీరని నష్టాన్ని మిగిల్చింది. చోరీపై పోలీసులు విచారణ చేపట్టారు.
News February 28, 2026
KK లైన్ కోల్పోయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్

APకి కీలకమైన కొత్తవలస-కిరండోల్ (KK లైన్) మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి రాయగడ డివిజన్లోకి వెళ్లింది. వాల్తేరు డివిజన్లో KK లైన్లోని అరకు, బొర్ర గుహాలు, ఐరన్ ఓర్, బొగ్గు వంటి కార్గో రవాణాతో జోన్కు భారీ ఆదాయం వచ్చేది. కొత్తవలస జంక్షన్తో పాటు VZM, SKLM జిల్లాల్లోని కీలక సెక్షన్లు రాయగడ డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కు వెళ్లాయి. ఈ జోన్ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడనుంది.


