News March 29, 2025
వరంగల్: చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్!

చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్ వస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన రాములు అనే వ్యక్తి పీఆర్ శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. 2012లో రాములు చనిపోయారు. ఆయన స్థానంలో అదే పేరు, తండ్రి పేరు, ఊరి పేరు ఒకటే ఉన్న మరో వ్యక్తిపై ప్రతీ ఏటా లైఫ్ సర్టిఫికెట్ తీస్తున్నట్లు తెలిసింది. బతికి ఉన్న రాములుకు ఆసరా పెన్షన్ రాకపోవడంతో అసలు విషయం బయటపడినట్లు సమాచారం.
Similar News
News April 20, 2025
కడప: మైనారిటీ సంక్షేమ అధికారిగా షేక్ హిదాయతుల్లా

ఉమ్మడి కడప జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా షేక్ హిదాయితుల్లా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన వ్యక్తిలకి చేరేలా పని చేస్తానని ఆయన తెలిపారు.
News April 20, 2025
మేదరమెట్ల: ఒంటరి మహిళలే వీరి టార్గెట్

అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు <<16152529>>అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే<<>>. ప్రకాశం(D) ఈతమొక్కలకు చెందిన ఏడుకొండలు, ఆషిద్ వ్యసనాలకు బానిసలై డబ్బు కోసం ఒంటరి మహిళల మెడలో బంగారు గొలుసులు దొంగలిస్తున్నారని DSP తెలిపారు. చీమకుర్తి, కొత్తపట్నం, టంగుటూరు, కొనకనమిట్ల, ఒంగోలు, మేదరమెట్లలో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారన్నారు. శనివారం మేదరమెట్లలో వీరిని అరెస్టు చేసి 126 గ్రా.ల 5చైన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
News April 20, 2025
ఒకే కాన్పులో ముగ్గురు జననం

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెంకి చెందిన షేక్ షబానాకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సంతానం కోసం చికిత్స పొంది గర్భం దాల్చారు. ఆమెకు బీపీ, షుగర్ థైరాయిడ్ ఉండటం వలన ఆసుపత్రి యజమాన్యం హైరిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనించారు.