News April 16, 2025

వరంగల్: చాక్లెట్ కోసం వెళ్లి అనంత లోకాలకు..

image

చెన్నారావుపేట మం. పుల్లయ్యబోడు తండాలో మంగళవారం <<16107593>>టిప్పర్ ఢీకొని<<>> రెండో తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన వెంకన్న-జ్యోతికి కూతురు, కొడుకు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కొడుకు అనిల్(8) చాక్లెట్ కొనుక్కోవడానికి షాప్‌కు వెళ్లాడు. నెక్కొండ నుంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News December 6, 2025

ఫిట్‌నెట్ సాధించిన గిల్.. టీ20లకు లైన్ క్లియర్!

image

IND టెస్ట్&ODI కెప్టెన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. అతడికి BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 9 నుంచి SAతో జరిగే T20 సిరీస్‌కు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నాయి. SAతో తొలి టెస్టులో గాయపడి రెండో టెస్టు, ODIలకు గిల్ దూరమయ్యారు. ఫిట్‌నెస్‌ ఆధారంగా గిల్ <<18459762>>T20ల్లో<<>> ఆడతారని BCCI పేర్కొన్న సంగతి తెలిసిందే.

News December 6, 2025

సిరిసిల్ల: స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరపాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమని ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం మైక్రో అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించగా ఆమె జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్‌తో కలిసి హాజరై మాట్లాడారు. సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News December 6, 2025

పోలింగ్ సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను సిద్దిపేటలో కలెక్టర్ కె. హైమావతి, అబ్జర్వర్ హరితల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో కంప్యూటరైజ్డ్ విధానంలో ప్రిసైడింగ్ అధికారులు, ఏపీఓల కేటాయింపు జరిగింది. రెండో విడతలో 1973 మంది పీఓలు, 2436 మంది ఏపీఓలు విధులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.