News January 30, 2025

వరంగల్: జక్రియాను విచారించి వదిలేసిన అధికారులు!

image

పోలీసులకు పట్టుబడిన జమాత్-ఉల్ ముస్లీమీన్- ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వరంగల్‌కు చెందిన జక్రియాను విచారించి ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు వదిలేశారు. పాకిస్థాన్‌లోని కరాచీలో జమాత్ సంస్థ నడుస్తోంది. 15 మంది సభ్యులతో జమాత్ కోసం శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వస్తుండగా ఈ నెల 25న చెన్నై ఎయిర్‌పోర్టులో జక్రియా టీం పోలీసులకు పట్టుబడింది. అయితే వారి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం

Similar News

News November 25, 2025

తిరుపతి: భక్తులకు గమనిక.. మరికాసేపట్లో

image

తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ పంచమి తీర్థం జరగనుంది. అమ్మవారి కోనేరులో స్నానం చేయడానికి లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. ఈక్రమంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కొన్ని సూచనలు చేశారు. ‘రోజంతా పంచమి గడియలు ఉంటాయి. భక్తులు పరుగులు పెట్టవద్దు, ఆత్రుత చెందవద్దు, ఉదయం 10.30 గంటల నుంచి భక్తులను పుష్కరిణిలోకి అనుమతిస్తాం. ఫోన్లు, నగలు, విలువైన వస్తువులను నీటిలోకి తీసుకెళ్లవద్దు’ అని SP కోరారు.

News November 25, 2025

సుబ్రహ్మణ్య స్వామిని పూజించే విధానం ఇదే..

image

సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయాన్నే తల స్నానం చేయాలి. తడి బట్టలతో కార్తికేయుడి ఆలయానికి వెళ్లి పూజ చేయాలి. మురుగన్‌కు పండ్లు, పువ్వులు సమర్పించడం శ్రేయస్కరం. బ్రహ్మచారిగా ఉన్న స్కందుడిని పూజిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్మకం. పండుగ నాడు బ్రహ్మచారులకు భోజనం పెట్టి, వస్త్రాలు సమర్పించి గౌరవిస్తారు. కావడి మెుక్కులు తీర్చుకునే ఆచారం కూడా ఉంది. ఫలితంగా పెళ్లికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.

News November 25, 2025

చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. వయా తిరుపతి

image

APలోని తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపేలా ద.మ. రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసి తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది. చెన్నై నుంచి HYD వరకు 778km ప్రాజెక్టులో తొలుత గూడూరు మీదుగా రైలు నడపాలని ద.మ. రైల్వే భావించింది. తిరుపతి నుంచి అమలు చేయాలన్న TN విజ్ఞప్తితో కొన్ని సవరణలు చేసింది. దీనికి ఆ ప్రభుత్వం అంగీకరిస్తే చెన్నై-తిరుపతి-HYD బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి.