News January 30, 2025
వరంగల్: జక్రియాను విచారించి వదిలేసిన అధికారులు!

పోలీసులకు పట్టుబడిన జమాత్-ఉల్ ముస్లీమీన్- ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వరంగల్కు చెందిన జక్రియాను విచారించి ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు వదిలేశారు. పాకిస్థాన్లోని కరాచీలో జమాత్ సంస్థ నడుస్తోంది. 15 మంది సభ్యులతో జమాత్ కోసం శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వస్తుండగా ఈ నెల 25న చెన్నై ఎయిర్పోర్టులో జక్రియా టీం పోలీసులకు పట్టుబడింది. అయితే వారి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం
Similar News
News February 19, 2025
CT: విధ్వంస వీరుడి ఖాతాలో అత్యధిక రన్స్

మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు WI మాజీ ప్లేయర్ గేల్ పేరిట ఉంది. 17 మ్యాచుల్లో 3 సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో 791 పరుగులు చేశారు. తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(742), ధవన్(701), సంగక్కర(683), గంగూలీ(665) ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ప్లేయర్లలో కోహ్లీ(529), రోహిత్(481) పరుగులు చేశారు. మరి ఈ టోర్నీలో వీరు అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొడతారా? కామెంట్ చేయండి.
News February 19, 2025
నెల్లూరు: రూ.1,566 కోట్ల పెట్టుబడి.. 400మందికి ఉపాధి

రాష్ట్రానికి రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 22726 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు పలు పరిశ్రమలు ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలకు SIPC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న SIPC భేటీలో ఆమోదించాల్సి ఉంది. కృష్ణపట్నంలో కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ (రిలయన్స్) రూ.1,566 కోట్లతో మెగా ఇండస్ట్రియల్ పార్కు స్థాపించనుంది. దీంతో 400 మందికి ఉపాధి కలగనుంది.
News February 19, 2025
చిన్న కొత్తపల్లి మాజీ కార్యదర్శి సస్పెన్షన్

బాపట్ల జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన ఈశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో చిన కొత్తపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల అవకతవకల విషయంలో పంచాయతీ కార్యదర్శి ఈశ్వర్ను సస్పెండ్ చేస్తూ.. బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈశ్వర్ రెడ్డి సంతమాగులూరు మండలం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.