News January 30, 2025
వరంగల్: జక్రియాను విచారించి వదిలేసిన అధికారులు!

పోలీసులకు పట్టుబడిన జమాత్-ఉల్ ముస్లీమీన్- ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వరంగల్కు చెందిన జక్రియాను విచారించి ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు వదిలేశారు. పాకిస్థాన్లోని కరాచీలో జమాత్ సంస్థ నడుస్తోంది. 15 మంది సభ్యులతో జమాత్ కోసం శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వస్తుండగా ఈ నెల 25న చెన్నై ఎయిర్పోర్టులో జక్రియా టీం పోలీసులకు పట్టుబడింది. అయితే వారి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం.
Similar News
News October 17, 2025
ఇన్స్టాలో దీపావళి ఎఫెక్ట్ ట్రై చేశారా?

దీపావళి కోసం మెటా సంస్థ ఇన్స్టాలో కొత్త ఎఫెక్ట్స్ తీసుకొచ్చింది. వాటిని ట్రై చేసేందుకు ఇన్స్టా ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ దగ్గర ‘+’ క్లిక్ చేయండి. మీకు కావాల్సిన ఫొటోని సెలక్ట్ చేసుకోండి. పైన ఉండే బ్రష్ ఐకాన్ క్లిక్ చేయండి. బోటమ్లో ఫైర్ వర్క్స్, దియాస్ అని ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మీకు నచ్చింది సెలక్ట్ చేసుకుంటే AI ఆటోమేటిక్గా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. మీకు నచ్చితే డన్ కొట్టి పోస్ట్ చేసుకోవచ్చు.
News October 17, 2025
నేడు విద్యుత్ ఉద్యోగులతో మరోసారి చర్చలు

AP: ప్రధాని పర్యటన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు <<18008727>>సమ్మె<<>>ను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చాయని JAC నేత కృష్ణయ్య తెలిపారు. దీంతో మిగిలిన అంశాలపై ఇవాళ చర్చించి సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు మధ్యాహ్నం 3 గం.కు విజయవాడలో చర్చలు ప్రారంభం కానున్నాయి.
News October 17, 2025
చతుర్వేదాల ఆవిర్భావం ఎలా జరిగిందంటే?

వేదాలు అపౌరుషేయాలు. అంటే వాటిని మనుషులు రచించలేదని అర్థం. పరమాత్మే మన కోసం వర ప్రసాదాలుగా అందించాడు. సృష్టి ఆరంభంలో గాయత్రి వంటి ఛందస్సుతో 4 వేదాలను ప్రకటించాడు. అగ్ని ద్వారా ఋగ్వేదాన్ని, వాయువు ద్వారా యజుర్వేదాన్ని, సూర్యుని ద్వారా సామవేదాన్ని, అంగీరసుని ద్వారా అధర్వణ వేదాన్ని అందించాడు. ఈ నలుగురి ద్వారానే ఈ వేదజ్ఞానం మహర్షులకు లభించింది. వారి నుంచే ఆ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. <<-se>>#VedikVibes<<>>