News March 31, 2025
వరంగల్: జాతరలో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో నిర్వహించిన గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘటనలో కుంతపల్లి గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సంగెం పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణలో పాల్గొన్న యువకుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News October 26, 2025
NLG: లక్ ఎవరిని వరిస్తుందో..!

కొత్త మద్యం పాలసీ నిర్వహణకు వేలైంది. ప్రభుత్వం గత నెల 26 నుంచి ఈ నెల 23వరకు మద్యం టెండర్ల దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చాయి. లక్కీడ్రా పద్ధతిలో సోమవారం షాపులు కేటాయించనున్నారు. ఇందుకు నల్గొండలోని లక్ష్మీ గార్డెన్స్లో ఏర్పాట్లు చేస్తుండగా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సంతోష్ పరిశీలించారు.
News October 26, 2025
విజయనగరంలో 4 ప్రైవేట్ బస్సులు సీజ్

నగరంలో రవాణా శాఖాధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపరవాణా కమిషనర్ మణికుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లతో కలసి వాహన రికార్డులు, ఫైర్ ఎక్విప్మెంట్, సీటింగ్ బెర్త్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని 4 వాహనాలను సీజ్ చేసి ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు.
News October 26, 2025
హోప్ ఐలాండ్కు అధికారులు.. రామంటున్న మత్స్యకారులు

తాళ్లరేవు మండలం కోరంగి సమీపంలోని హోప్ ఐలాండ్లో ఉన్న 110 మంది మత్స్యకారులను తుపాను నేపథ్యంలో తరలించేందుకు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, జిల్లా పోలీసు అధికారులు అక్కడికి వెళ్లారు. అయితే తుపానులు తమకు అలవాటేనంటూ వారు సురక్షిత ప్రాంతాలకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినడం లేదని ఆర్డీఓ వెల్లడించారు.


