News March 31, 2025
వరంగల్: జాతరలో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో నిర్వహించిన గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘటనలో కుంతపల్లి గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సంగెం పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణలో పాల్గొన్న యువకుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News December 9, 2025
భారత్ రైస్పై US టారిఫ్స్.. ఎవరికి నష్టం?

భారత్ రైస్పై US <<18509981>>టారిఫ్స్<<>>(ప్రస్తుతం 40%) పెంచితే మనం కంగారుపడాల్సిన అవసరంలేదని వాణిజ్య నిపుణులు అంటున్నారు. ‘2024-25లో ఇండియా $337.10 మిలియన్ల బాస్మతి రైస్, $54.64 మిలియన్ల నాన్-బాస్మతి రైస్ ఎగుమతి చేసింది. IND బాస్మతిలో ఉండే రిచ్ అరోమా, టెక్స్చర్, టేస్ట్ US రైస్లో ఉండదు. సుంకాల భారం వినియోగదారుల మీదే పడుతుంది. ఇతర దేశాల్లోనూ మన రైస్కు డిమాండ్, మార్కెట్ పెరుగుతోంది’ అని చెబుతున్నారు.
News December 9, 2025
ఉంగుటూరులో ఈనెల 11న మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఈ నెల11న జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు.
News December 9, 2025
క్వార్టర్ మందు.. చికెన్ బిర్యానీ!

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగియనుండటంతో గ్రామాల్లో ప్రలోభాల పర్వం జోరందుకుంది. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఓటుకు రూ.1000-4000 వరకు ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో చికెన్ బిర్యానీ, క్వార్టర్, కూల్డ్రింక్స్ పంచుతున్నారు. మరికొన్ని చోట్ల ఇంటికి కేజీ కోడికూర పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? COMMENT


