News July 30, 2024

వరంగల్ జిల్లాలో విష జ్వరాలు

image

ఉమ్మడి WGL జిల్లాలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. పెద్దలు, పిల్లలతో కలిసి మొత్తం 1,300 పడకల వార్డులున్న MGMకు జిల్లాతో పాటు.. పొరుగు జిల్లాలు, AP, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి రోగులు వస్తున్నారు. ప్రతిరోజు 50కి పైగా రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారు. జులై నెలలలో ఇప్పటి వరకు PHCలలో 41,152 ఓపీ రోగులు రాగా.. 1,856జ్వరాలు, 29వాంతులు, విరేచనాలు, 6డెంగీ, 2మలేరియా కేసులు నమోదైనట్లు వైధ్యాధికారులు తెలిపారు.

Similar News

News November 24, 2025

వరంగల్: చిన్నారి హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష

image

మూడేళ్ల పాప ఫాతిమా సబాను హత్య చేసిన కేసులో నిందితురాలు హజీరా బేగం, ఆమె సహచరుడు సయ్యద్ యూసుఫ్‌కు యావజ్జీవ కారాగార శిక్షను వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలాగీతాంబ సోమవారం విధించారు. వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డు అవుతుందని 2022 ఏప్రిల్ 23న ఇద్దరూ కలిసి క్రూరంగా హతమార్చినట్లు సాక్ష్యాధారాలతో రుజువైనందున కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

News November 24, 2025

వరంగల్ కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ రద్దు

image

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.

News November 22, 2025

వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్‌స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్‌స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.