News December 15, 2024
వరంగల్ జిల్లా కేంద్రంలో పర్యటించిన స్పీకర్

వరంగల్ జిల్లా కేంద్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 24, 2025
వరంగల్ ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు

వరంగల్ డివిజన్ వ్యాప్తంగా 8 మంది ఎస్సైలకు సీఐగా పదోన్నతి కల్పించేందుకు డీపీసీ సిఫారసులను కమిషనర్ సి.హరికిరణ్ ఆమోదించారు. రోస్టర్ ప్రకారం రమాదేవి, రజిత, చంద్రశేఖర్, జ్యోతి, సరిత, అశోక్కుమార్ తదితరులకు గ్రీన్సిగ్నల్ లభించింది. అలాగే శ్రీనివాస్రెడ్డి, మురళి ఎక్సైజ్ సూపరింటెండెంట్లుగా, అంజన్రావు జాయింట్ కమిషనర్గా పదోన్నతి పొందారు. జీవో విడుదల అనంతరం పోస్టింగ్లు ఇవ్వనున్నారు.
News December 21, 2025
జాతీయ కరాటే పోటీల్లో వర్ధన్నపేట బాలుడికి స్వర్ణం

భోపాల్లో నిర్వహించిన 16వ నేషనల్ WFSKO ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్-2025లో వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఎం.మహాజన్ ఉపేంద్ర బంగారు పతకం సాధించాడు. పుస్కోస్ పాఠశాలలో చదువుతున్న ఉపేంద్ర, 10 ఏళ్ల లోపు బాలుర విభాగంలో దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది క్రీడాకారులతో తలపడి అద్భుత నైపుణ్యంతో ఈ విజయాన్ని అందుకున్నాడు. జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన ఉపేంద్రను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
News December 21, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం చికెన్ విత్ స్కిన్ KG రూ.240 నుంచి రూ.260 పలకగా స్కిన్ లెస్ KG రూ.260-రూ.280గా ఉంది. అలాగే లైవ్ కోడి రూ.170-రూ.180 పలుకుతోంది. సిటీతో పోలిస్తే పల్లెటూరులో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది.


