News March 28, 2025
వరంగల్: జిల్లా వ్యాప్తంగా మొరాయిస్తున్న మీసేవ కేంద్రాలు!

జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాలు, ఇంటర్నెట్ కేంద్రాలు మొరాయిస్తున్నాయని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోన్ దరఖాస్తు కోసం, స్కాలర్షిప్ అప్లికేషన్ కోసం మీసేవ కేంద్రాల వద్దకు వెళ్లగా ఉదయం నుంచి మీ సేవ కేంద్రాల సర్వీసుకు అంతరాయం ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించి సాంకేతిక లోపాన్ని సరి చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.
Similar News
News July 8, 2025
HYD: GHMC హెడ్ ఆఫీస్లో 2.5 టన్నుల ఈ-వేస్ట్ తొలగింపు.!

స్వచ్ఛ్ భారత్ మిషన్లో భాగంగా HYD జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోని ఐటీ విభాగం నుంచి 2.5టన్నుల ఈ-వేస్ట్ను అధికారులు తొలగించారు. ఇందులో పాత కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్ట్రిడ్జీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఈ-వేస్ట్ను ఆసియాలోనే మొదటి LEED ప్లాటినమ్-సర్టిఫైడ్ ఫెసిలిటీ అయిన దుండిగల్ వద్దకు తరలించారు. ఇక్కడే రీసైకిలింగ్ జరుగుతుందని తెలిపారు.
News July 8, 2025
నెల్లూరు రాజకీయాలకు మాయని మచ్చ..!

హుందాగా నడిచే నెల్లూరు రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు వెళ్లాయి. పర్సంటేజీల ప్రసన్న, అప్పుల్లో పీహెచ్డీ చేసిన ప్రసన్న అంటూ ప్రశాంతి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన శ్రుతిమించారు. ‘ప్రశాంతి రెడ్డి చాలా చోట్ల PHdలు చేశారు. పీహెచ్డీలు అంటే మీరు అనుకునేవి కావు. వేమిరెడ్డిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. ఆయనకు ప్రాణహాని ఉంది’ అని ప్రసన్న అన్నారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై మీరేమంటారు?
News July 8, 2025
స్టేషన్ఘన్పూర్లో రూ.800 కోట్లు ‘రప్పా.. రప్పా’

స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రప్పా.. రప్పా డైలాగ్ హాట్ టాపిక్ అయింది. నియోజకవర్గ అభివృద్ధికి రప్పా.. రప్పా రూ.800 కోట్ల నిధులు తెచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలో పొందుపరిచారు. ఈ మధ్య ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.