News March 24, 2024

వరంగల్: జూపార్క్‌కు త్వరలో పెద్దపులి

image

ఓరుగల్లు వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెద్దపులి త్వరలో సందడి చేయనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండలోని కాకతీయ జూపార్కులో సిద్ధం చేస్తున్నారు. రూ.60 లక్షల వ్యయంతో ఇక్కడ దీనికోసం ప్రత్యేక ఎంక్లోసర్ సిద్ధమైంది. పులికి నివాసయోగ్యమైన అన్నిసౌకర్యాలు కల్పిస్తున్నారు. అడవి వాతావరణం ఉండటం వల్ల అది స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందని జిల్లా అటవీశాఖ అధికారిణి లావణ్య తెలిపారు.

Similar News

News December 18, 2025

వరంగల్ జిల్లాలో సింగిల్ డిజిట్లో గెలిచిన అభ్యర్థులు!

image

నర్సంపేట మండలం జీజీఆర్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి భూస నరసయ్య ఒక్క ఓటు తేడాతో గెలిచారు. 453 ఓట్లకు గాను 421 పోలై నరసయ్యకు 191, BRS అభ్యర్థి కుమారస్వామికి 190 ఓట్లు వచ్చాయి. ఖానాపురం మండలం అయోధ్యనగర్‌లో BRS అభ్యర్థి కూస విమల నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నెక్కొండ మండలం మడిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆంగోత్ అనూష, అజ్మీరా మంగ్యానాయక్ తండాలో BRSఅభ్యర్థి మాలోత్ వెంకట్ స్వల్ప మెజార్టీతో గెలిచారు.

News December 17, 2025

గొల్లభామ తండా సర్పంచ్‌గా బాలు నాయక్

image

చెన్నారావుపేట మండలంలోని గొల్లభామ తండా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన గుగులోతు బాలు నాయక్ విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News December 17, 2025

వరంగల్: 77.58 శాతం పోలింగ్ @1PM

image

వరంగల్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 77.58శాతం పోలింగ్ అయింది. చెన్నారావుపేట మండలంలో 84 శాతం, ఖానాపూర్‌లో 70.35, నర్సంపేటలో 82.16, నెక్కొండలో 75.4 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.