News February 18, 2025
వరంగల్: టూరిస్టుల కోసం స్పెషల్ బస్సు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రదేశాల సందర్శన కోసం టూరిజం సంస్థ ప్రత్యేక ఏసీ బస్సును ఏర్పాటు చేసింది. ఈనెల 20న ఉదయం 7.45కు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప, లక్నవరం, రాత్రి ఖిలా వరంగల్ సందర్శన అనంతరం రాత్రి 8 గంటలకు హన్మకొండకు చేరుకుంటుంది. పెద్దలకు రూ.980లు, పిల్లలకు రూ.790లుగా టికెట్ ధర నిర్ణయించారు.
Similar News
News April 11, 2026
వరంగల్: అంగన్వాడీ సేవలు స్మార్ట్ దిశగా.. 4జీ ఫోన్ల పంపిణీ

జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత స్మార్ట్గా మారనుంది. వర్ధన్నపేట, వరంగల్, నర్సంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 919 కేంద్రాల్లో సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం 4జీ సెల్ఫోన్లను అందిస్తోంది. మొత్తం 874 ఫోన్లు పంపిణీ చేయనుండగా, ఇప్పటి వరకు పాత 2జీ ఫోన్లతో ఎదురైన సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభించనుంది.పోషణ్ ట్రాకర్ యాప్, ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు వంటి ప్రక్రియలు వేగవంతం అవుతాయి.
News April 11, 2026
పున్నెలు హత్య కేసు ఇచ్చిన భయానక సందేశం

హనుమకొండ జిల్లా పున్నెలు ఘటన ఈ సమాజానికి గంభీర హెచ్చరికగా నిలిచింది. కుమారుడు పుట్టాలనే మొండి అభిప్రాయం, లింగ వివక్ష, అక్రమ సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ కేసు స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశాయి. మహిళలపై వివక్షను నిర్మూలించడం, చట్టాలను కఠినంగా అమలు చేయడం, సమాజంలో అవగాహన పెంచడం అత్యవసరం. మీరేమంటారు?
News April 11, 2026
పున్నెలు హత్య కేసు ఇచ్చిన భయానక సందేశం

హనుమకొండ జిల్లా పున్నెలు ఘటన ఈ సమాజానికి గంభీర హెచ్చరికగా నిలిచింది. కుమారుడు పుట్టాలనే మొండి అభిప్రాయం, లింగ వివక్ష, అక్రమ సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ కేసు స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశాయి. మహిళలపై వివక్షను నిర్మూలించడం, చట్టాలను కఠినంగా అమలు చేయడం, సమాజంలో అవగాహన పెంచడం అత్యవసరం. మీరేమంటారు?


