News March 19, 2025

వరంగల్: తగ్గిన అరుదైన రకం మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి నిన్నటిలాగే రూ.15,800 ధర వచ్చింది. 5531 రకం మిర్చి నిన్న రూ.11,000 ధర పలకగా నేడు రూ. 10,500కి తగ్గింది. అలాగే టమాటా మిర్చికి నిన్నటిలాగే రూ.30 వేలు ధర, సింగిల్ పట్టి మిర్చికి మంగళవారం రూ.33వేలు ధర రాగా నేడు రూ. 31వేలకి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు.

Similar News

News April 20, 2025

సిరిసిల్ల: ఓపెన్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

సిరిసిల్ల జిల్లాలో నిర్వహించే ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు మరో పరీక్ష జరుగుతుందని చెప్పారు. జిల్లాలో మొత్తం (4) పరీక్షా కేంద్రాలలో పదో తరగతి 298, ఇంటర్ 856 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.

News April 20, 2025

ఏలూరు: ఊరేసుకుని వ్యక్తి మృతి

image

ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి తూర్పు వీధికి చెందిన దుర్గారావు (34) ఊరేసుకుని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతిపై సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి 2 ఏళ్ల క్రితం వివాహమైందన్నారు. ఈనెల 18న రాత్రి భార్యతో గొడవపడి రూమ్‌లోకి వెళ్లాడని భార్య చెప్పింది. శనివారం తలుపు తీస్తే ఊరికి వేలాడుతూ కనిపించాడని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.

News April 20, 2025

పోతంగల్: కొడుకు పెళ్లి.. తండ్రి మృతి

image

తెల్లవారితే కొడుకు పెళ్లి ఉండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. రుద్రూర్‌కు చెందిన నాగయ్య(52) తన కొడుకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకే శనివారం పోతంగల్‌లోని కారేగాంకు బైక్ పై వెళుతుండగా హంగర్గ ఫారం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టాడు. అతడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!