News February 13, 2025
వరంగల్: తగ్గిన మక్కల ధర.. పల్లికాయ ధరలు ఇలా!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కల ధర మళ్లీ తగ్గింది. మంగళవారం రూ.2,370 పలికిన మక్కలు(బిల్టీ) ధర బుధవారం మరింత తగ్గి రూ.2,355కి చేరింది. ఈరోజు మరింత తగ్గి రూ.2,350కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే.. క్వింటా సూక పల్లికాయ ధర రూ.6,410 పలకగా.. పచ్చి పల్లికాయ రూ.4,900 పలికిందని పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
తూ.గో: ఇకపై వేరే లెవెల్.. పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్..!

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. దీనిలో భాగంగా CRC పథకం ద్వారా తీర రక్షణ చర్యలు, యువతకు స్పీడ్ బోట్, స్కూబా డైవింగ్లో శిక్షణ కల్పిస్తారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సముద్రంలో చేప పిల్లలను విడుదల, రూ.2 కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, 200 నాటికల్ మైళ్ల వరకు వేటకు అనుమతి వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
News November 22, 2025
WGL: జైలు భూమి తాకట్టు.. రుణం మళ్లింపుపై విజిలెన్స్ కసరత్తు

WGL సెంట్రల్ జైలు భూమిని తాకట్టు పెట్టి TG SSHCL రూ.117 కోట్ల రుణం తీసుకున్నా, అది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి కాకుండా ఇతర ఖర్చులకు మళ్లించినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. జీవో 31తో బదిలీ చేసిన 56 ఎకరాల భూమి తాకట్టు విధానాన్ని సీఎం రేవంత్రెడ్డి తప్పుబట్టి విచారణకు ఆదేశించారు. ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయ్యగా, విజిలెన్స్ నివేదిక అందిన వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోనున్నారు.
News November 22, 2025
WGL: మార్చిలోపు ఆస్పత్రి పూర్తికి లక్ష్యం!

WGL సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మార్చిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ప్రభుత్వం పెంచిన రూ.1,725.95 కోట్ల అంచనా వ్యయాన్ని ఆడిట్ తర్వాత రూ.1,558 కోట్లకు తగ్గించారు. సివిల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పారిశుధ్య పనులకు రూ.1,158 కోట్లు కేటాయించగా, మొత్తం 85% పనులు పూర్తయ్యాయి. ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ జరుగుతోంది. నిధుల సమస్య లేకుండా మార్చిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు?


