News July 9, 2024
వరంగల్: తన ఇంటినే బడిగా మార్చారు

WGL జిల్లాలో విషాదం నెలకొంది. తన ఇంటినే బడిగా మార్చి అనేకమందికి అక్షరాలు నేర్పించిన చదువుల తల్లి HYDలో ఆదివారం మృతి చెందింది. పర్వతగిరికి చెందిన యశోదమ్మ(101) ఏడు దశాబ్దాల క్రితమే భర్త సహకారంతో పర్వతగిరితో పాటు.. చుట్టు పక్కల గ్రామాల వారికి తమ ఇంటి వద్ద చదువు బోధించింది. మాజీ మంత్రి దయాకర్ రావు సైతం ఆమె వద్ద ఓనమాలు నేర్చుకున్నారు. ఆమె HYDలో మరణించగా.. పర్వతగిరిలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News December 31, 2025
మెరుగైన వైద్య సేవల కోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్: WGL కలెక్టర్

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా లోపాల దిద్దులుబాటకు 90 రోజుల యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్వో, ఎంజీఎం, సీకేఎం, ఆర్ఈహెచ్, నర్సంపేట, వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు సంబంధించిన అధికారులతో బుధవారం సమీక్షించారు. వైద్య ఉద్యోగులకు ఫేస్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలన్నారు. హాస్పిటల్స్ సూపర్డెంట్లు, అధికారులు పాల్గొన్నారు.
News December 30, 2025
వరంగల్: ఇక మునిసిపల్ పోరుపై రాజకీయం..!

రెండు నెలలు గ్రామ పంచాయతీ ఎన్నికల చుట్టు తిరిగిన రాజకీయాలు.. ఇప్పుడు పట్టణ పోరుపై తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. దీంతో ఆయా పట్టణాల్లో కౌన్సిల్ స్థానాల ఆశావహులు, నాయకుల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు వార్డుల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
News December 30, 2025
వరంగల్: ఉదయం 6 నుంచే యూరియ విక్రయం!

వరంగల్ జిల్లాలో రైతుల పంటలకు ఉపయోగించే యూరియ కౌంటర్లు ఉ.6 గం.కు తెరిచి విక్రయించవచ్చని కలెక్టర్ సత్య శారద అధికారులను అదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరం అయితే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో యూరియా డీలర్స్ దగ్గర 434 టన్నుల యూరియా స్టాక్ ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 14375 టన్నులు పంపిణీ చేశామని అన్నారు.


