News May 23, 2024

వరంగల్: తరలివచ్చిన పత్తి.. పెరిగిన ధర

image

నిన్న ఎండ తీవ్రత నేపథ్యంలో వరంగల్ ఎనుమాముల మార్కెట్ బంద్ ఉండగా.. ఈరోజు ప్రారంభమవడంతో నేడు పత్తి తరలివచ్చింది. గత రెండు రోజులతో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,040, మంగళవారం రూ.7,070 పలికాయి. ఈరోజు మరింత పెరిగి రూ.7,210 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

Similar News

News November 27, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ సమీక్ష

image

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

News November 27, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ సమీక్ష

image

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

News November 27, 2025

వరంగల్: ఏడాది గడిచినా వేతనాలు అందని దుస్థితి!

image

ఇంటింటి కుటుంబ సర్వే పూర్తై ఏడాది గడిచినా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు వేతనాలు అందక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో 1.79 లక్షల కుటుంబాలపై 1200 మంది ఎన్యుమరేటర్లు, 119 మంది సూపర్వైజర్లు పనిచేశారు. ఎన్యుమరేటర్లకు రూ.10వేలు, సూపర్వైజర్లకు రూ.12వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రతి దరఖాస్తుకు రూ.30 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినా చెల్లింపులు నిలిచిపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.