News February 5, 2025
వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News January 25, 2026
పన్ను వసూళ్లలో ఎదురేలేదు..

ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ట్యాక్స్ వసూళ్ల విషయంలో హాంకాంగ్(13.1%), ఇండోనేషియా(13.1%), మలేషియా(12%)ను ఇండియా వెనక్కి నెట్టిందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో వెల్లడించింది. ‘దేశ ట్యాక్స్-GDP నిష్పత్తి 19.6%గా ఉంది. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట, GST, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం వంటివి ఇందుకు కారణం. జర్మనీ-38%, అమెరికా-25.6%తో మెరుగ్గా ఉన్నాయి’ అని పేర్కొంది.
News January 25, 2026
కామారెడ్డి: ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు జిల్లా వాసి

నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామానికి చెందిన కమ్మరి రాజు దేశ రాజధాని ఢిల్లీలో 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. భారత ప్రభుత్వం నుంచి ఆయనకు పిలుపు రావడంతో శనివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కమ్మరి రాజు ఒక్కరు ఉండటం విశేషం.
News January 25, 2026
తల్లిపాల విషయంలో ఈ అపోహలు వద్దు

పిల్లలకు తల్లిపాలు అమృతతుల్యం. అయితే అపోహలతో కొందరు పిల్లలకు సరిగా పాలు పట్టట్లేదంటున్నారు నిపుణులు. సరిపడా పాలు రావట్లేదని కొందరు ఫార్ములా మిల్క్ ఇస్తుంటారు. కానీ పిల్లల తరచూ పాలు ఇస్తుంటేనే పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు. అలాగే ఫార్ములా మిల్క్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. తల్లిపాలలో ఇమ్యునిటీ, ఐక్యూ బెటర్గా ఉంటుంది కాబట్టి పిల్లలకు తల్లిపాలే ఉత్తమం అని చెబుతున్నారు.


