News February 5, 2025

వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

image

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News December 19, 2025

తెలంగాణ ఫుట్‌బాల్ జట్టుకు సిద్దిపేట బిడ్డ

image

జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీలో తలపడే తెలంగాణ ఫుట్‌బాల్ జట్టుకు సిద్దిపేట వాసి సాయి యశ్వంత్ ఎంపికయ్యాడు. యశ్వంత్ సిద్దిపేటలోనే ఫుట్‌బాల్‌లో ఓనమాలు నేర్చుకుని, ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. యశ్వంత్ ప్రతిభను గుర్తించి రాష్ట్ర జట్టులోకి తీసుకోవడంపై టీఎఫ్‌ఏ సెక్రటరీ ఫాల్గుణ, కోచ్ అక్బర్ నవాబ్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా క్రీడాకారుడు జాతీయ జట్టుకు ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News December 19, 2025

విశాఖ రుషికొండ బిల్డింగ్‌పై జగన్ ఏమన్నారంటే?

image

AP: మెడికల్‌ కాలేజీల అంశంపై గవర్నర్‌ను కలిసిన అనంతరం YCP చీఫ్ జగన్ విశాఖ రుషికొండ నిర్మాణాలపై స్పందించారు. ‘మా హయాంలో రుషికొండపై రూ.230CRతో బ్రహ్మాండమైన బిల్డింగ్‌ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికమైంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు యోగా డే కోసం అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామగ్రి కొనుగోలులోనూ అవినీతికి పాల్పడ్డారు’ అని ఆరోపించారు.

News December 19, 2025

డిసెంబర్ 19: చరిత్రలో ఈరోజు

image

* 1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై అప్పటి PM నెహ్రూ ప్రకటన
* 1961: పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి కల్పించిన భారత సైన్యం
* 1974: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ జననం
2015: సినీ నటుడు, కవి రంగనాథ్ మరణం(ఫొటోలో)
– గోవా విముక్తి దినోత్సవం