News February 5, 2025
వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News January 19, 2026
మాఘ గుప్త నవరాత్రుల గురించి మీకు తెలుసా?

మాఘమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులను ‘మాఘ గుప్త నవరాత్రులు’ అంటారు. అయితే, ఇవి రహస్యంగా (గుప్తంగా) అమ్మవారిని ఉపాసించేవి. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. ఈ సమయంలో శక్తి స్వరూపిణి అయిన వారాహి దేవిని, దశమహావిద్యలను భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా సాధకులు ఆధ్యాత్మిక శక్తి కోసం, ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలగడం కోసం ఈ నవరాత్రులలో కఠిన నియమాలతో పూజలు నిర్వహిస్తారు.
News January 19, 2026
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 93 అర్జీలు

కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 93 ఫిర్యాదులు అందాయి. డీఐజీ, జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, పలువురు సీఐలు పాల్గొన్నారు.
News January 19, 2026
రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 31 ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://skltghu.ac.in/


