News March 1, 2025

వరంగల్: తెలంగాణ పిండివంటలను నేర్చుకున్న కేరళ యువత

image

కేరళ రాష్ట్రానికి చెందిన 27 మంది యువతీ యువకులు రంగశాయిపేటలోని హోమ్ ఫుడ్స్ సందర్శించారు. ఈనెల 20వ తేదీ నుండి మార్చ్ 3 వరకు ఐదు రోజుల పాటు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. తెలంగాణ పిండివంటలైన సకినాలు, మురుకులు, గరిజలు, సర్వపిండి మొదలు వంటలను నిర్వాహకులు కేరళ నుంచి వచ్చిన యువతకు నేర్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు గురించి వారికి తెలియజేశారు.

Similar News

News March 24, 2025

నేను సభకు రావొద్దని రాసివ్వండి: జగదీశ్ రెడ్డి

image

TG: ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సస్పెండ్ అయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి వెళ్లగా సభలోకి రావొద్దని చీఫ్ మార్షల్ సూచించారు. దీంతో స్పీకర్ ఇచ్చిన బులెటిన్ చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను సభకు రావొద్దని రాతపూర్వకంగా రాసివ్వాలన్నారు. లేకపోతే అక్కడే కూర్చొని నిరసన తెలుపుతానని చెప్పారు. మరోవైపు BRS ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి వచ్చారు. రుణమాఫీ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.

News March 24, 2025

WGL మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి.. ధరలు ఇలా!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు మిర్చి పోటెత్తింది. అయితే తాము ఆశించిన విధంగా ధరలు రాలేదని అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.13,000 ధర రాగా.. 341 రకం మిర్చికి రూ.12,400 పలికిందని వ్యాపారులు తెలిపారు. అలాగే వండర్ హాట్(WH) మిర్చి క్వింటాకి రూ.14,500 ధర వచ్చిందన్నారు.

News March 24, 2025

లింగాల మండలంలో వైఎస్ జగన్

image

లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. తీవ్ర ఈదురుగాలులతో నేలకూలిన అరటి పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతులకు భరోసా కల్పిస్తున్నారు. జగన్ వెంట కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఉన్నారు. మండలంలో దాదాపు 2500 ఎకరాలలో అరటి తోట నేలవాలినట్లు అంచనా వేశారు.

error: Content is protected !!