News July 25, 2024
వరంగల్: దారుణంగా పతనమైన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర భారీగా పతనమైంది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పత్తి ఈరోజు భారీగా పడి పోయింది. సోమవారం రూ.7,150 పలికిన క్వింటా పత్తి మంగళవారం రూ.7,180, బుధవారం రూ.7,230 అయింది. ఈ క్రమంలో నేడు దారుణంగా పతనమై రూ.7,025కి చేరింది. దీంతో మార్కెట్కు పత్తి తీసుకుని వచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News November 14, 2025
వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక కంట్రోల్ రూమ్

వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వరంగల్ కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ప్రారంభించినట్లు కలెక్టర్ సత్య శారద ప్రకటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు జరిగే మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ కంట్రోల్ రూమ్ ముఖ్యపాత్ర పోషిస్తుందని వివరించారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ఫ్రీ 1800 425 3424ని సంప్రదించాలన్నారు.
News November 12, 2025
వరంగల్: ఉపాధ్యాయుల హాజరుపై FRS నిఘా..!

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల డుమ్మాకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) యాప్ ద్వారా ఉపాధ్యాయుల హాజరుపై నిఘా పెట్టనుంది. హాజరు ఇన్, ఔట్ టైమ్లను యాప్లో నమోదు చేయకపోతే చర్యలు తప్పవు. సెలవు, ట్రైనింగ్, కార్యాలయ పనులకైనా యాప్ ద్వారా అనుమతి తప్పనిసరి. వరంగల్ జిల్లాలో 325 ప్రాథమిక, 121 ఉన్నత పాఠశాలల్లో ఈ యాప్ అమలు మొదలైంది.
News November 10, 2025
సమగ్ర అభివృద్ధి కోసం పని చేయాలి: కలెక్టర్

వరంగల్ కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన డీఆర్డీఏ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి శాఖ తమ ప్రణాళికలను సమయపాలనతో అమలు చేస్తేనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలపడుతుందని సూచించారు.


