News July 25, 2024
వరంగల్: దారుణంగా పతనమైన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర భారీగా పతనమైంది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పత్తి ఈరోజు భారీగా పడి పోయింది. సోమవారం రూ.7,150 పలికిన క్వింటా పత్తి మంగళవారం రూ.7,180, బుధవారం రూ.7,230 అయింది. ఈ క్రమంలో నేడు దారుణంగా పతనమై రూ.7,025కి చేరింది. దీంతో మార్కెట్కు పత్తి తీసుకుని వచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News January 9, 2026
వరంగల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా

వరంగల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళా 13-01-2026న ఐటిఐ క్యాంపస్లో నిర్వహించనున్నారు.
ఈ మేళాలో IndusInd Nippon Life Insurance Co. LTD, శ్రీ సాయి అగ్రి టెక్నాలజీస్ సంస్థలు పాల్గొననున్నాయి. IndusInd Nippon Life Insurance సంస్థలో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులకు 25 ఖాళీలు ఉన్నాయన్నారు.
News January 9, 2026
మే 3న నీట్.. సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం

జిల్లాలో మే 3న జరగనున్న నీట్-2026 (యూజీ) పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాలపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ఈ నెల 15 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో విజయలక్ష్మీ, నోడల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
News January 9, 2026
వరంగల్: 5 కొత్త లేఅవుట్లకు అనుమతి

కొత్త లేఅవుట్ల ఏర్పాటుకు జిల్లా లేఅవుట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఐదు లేఅవుట్లకు తుది అనుమతులు మంజూరు చేశారు. పైడిపల్లి, దేశాయిపేట, స్తంభంపల్లి, నక్కలపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న లేఅవుట్లను పరిశీలించి ఆమోదం తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు


