News September 12, 2025
వరంగల్ నగరంలో అర్ధరాత్రి లాడ్జిల్లో పోలీసుల తనిఖీ

వరంగల్ నగరంలో నేరాల నియంత్రణ, నేరస్థులను గుర్తించే లక్ష్యంతో మట్టెవాడ పోలీసులు అర్ధరాత్రి తమ పరిధిలోని వివిధ లాడ్జిలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా లాడ్జిలో బస చేసిన వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరించారు.
అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను పోలీసులు విచారించారు. ఈ రకమైన తనిఖీలు నేరాలను అరికట్టడానికి, శాంతిభద్రతలు కాపాడటానికి ఉపయోగపడతాయని పోలీసులు తెలిపారు.
Similar News
News March 3, 2026
ఆముదం పంట రెండో గెల దశలో ఉందా?

యాసంగిలో సాగు చేసిన ఆముదం పంట రెండో గెల దశలో ఉంటే నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వేసవిలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఈ పంటలో ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లేదా ప్రొఫెనోఫాస్ 2mlను కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో ఎండు తెగులు గమనిస్తే లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను కలిపి మొక్క మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి.
News March 3, 2026
NCC అభ్యర్థులకు గుడ్న్యూస్.. ఆర్మీలో 76పోస్టులు..

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 124వ కోర్సు కోసం 76 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ పాసై, NCC C సర్టిఫికెట్లో B గ్రేడ్ ఉన్నవారు మార్చి 16వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 19 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, SSB, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్సైట్: www.joinindianarmy.nic.in
News March 3, 2026
మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా?

ఇజ్రాయెల్, US-ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్కు వ్యాపించింది. US-ఇజ్రాయెల్కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అండగా నిలిచాయి. ఇరాన్కు సాయం చేస్తామని చైనా ప్రకటించింది. మిడిల్ ఈస్ట్లో మొదలైన యుద్ధం Asia, europe దేశాలకు పాకి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోగా నిత్యావసరాలపైనా వార్ ఎఫెక్ట్ పడుతుందేమోనని సామాన్యుడిలో ఆందోళన నెలకొంది.


