News March 7, 2025

వరంగల్ నగరంలో పోలీసుల పుట్ పెట్రోలింగ్

image

నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు భరోసా కల్పించే దిశగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వరంగల్ డివిజినల్ పోలీసులు ఏసీపీ నందిరాం నాయక్ నేతృత్వం పోలీసులు మండిబజార్, చార్ బోలి ప్రాంతాల్లో పుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు.

Similar News

News March 9, 2025

సంగారెడ్డిలో జాబ్ మేళా రేపటికి మార్పు

image

సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా సోమవారానికి ఛేంజ్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ తెలిపారు. MSN కంపెనీలు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఎస్సీ, ఎంఎస్సీ పూర్తిచేసి కెమిస్ట్రీ సబ్జెక్టు చదివిన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గలవారు రేపు ఉదయం 10 గంటలకు జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు.

News March 9, 2025

రేపు యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం: ఎస్పీ 

image

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుందని ఏలూరు ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీసు, సబ్ డివిజనల్ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు గమనించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

News March 9, 2025

కాంగ్రెస్ MLC అభ్యర్థులు వీరేనా?

image

TG: MLA కోటా MLC అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది. 4 స్థానాల్లో కాంగ్రెస్‌కు 3, CPIకి 1 దక్కనుంది. INC నుంచి నల్గొండ DCC అధ్యక్షుడు శంకర్ నాయక్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. OC లేదా BC కోటాలో జెట్టి కుసుమ కుమార్, కుమార్ రావు, SC కోటాలో అద్దంకి దయాకర్, రాచమళ్ల సిద్దేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు రాష్ట్ర నేతలు కాసేపట్లో మరోసారి భేటీ కానున్నారు.

error: Content is protected !!