News July 12, 2024
వరంగల్: నిన్నటి కంటే రూ.1500 పెరిగిన మిర్చి ధర

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి.
> ఏసీ తేజ మిర్చి నిన్న క్వింటాకు రూ.నిన్నటిలాగే రూ.18,300 పలికింది.
> ఏసీ 341 రకం మిర్చి సైతం గురువారం లాగే రూ.14,500 పలికింది.
> వండర్ హాట్(WH) మిర్చి మాత్రం గత 2రోజులతో పోలిస్తే భారీగా పెరిగింది. మొన్న రూ.14,800 ధర పలకగా.. నిన్న రూ.15,000కి చేరింది. నేడు మరింత పెరిగి రూ.16,500 అయింది.
Similar News
News September 18, 2025
బతుకమ్మ వేడుకలు.. దద్దరిల్లనున్న ట్రై సిటీ!

బతుకమ్మ వేడుకలకు వరంగల్ ట్రై సిటీ సిద్ధమవుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వేయి స్తంభాల గుడి, భద్రకాళి, పద్మాక్షమ్మ గుట్ట, ఉర్సు రంగలీలా మైదానం, చిన్న వడ్డేపల్లి చెరువు, శివనగర్ గ్రౌండ్, మెట్టుగుట్ట, మడికొండ చెరువు, బెస్తం చెరువు, తోట మైదానం, డబ్బాల్ హనుమాన్ గుడి, బంధం చెరువు, కాశిబుగ్గ శివాలయం, కట్టమల్లన్న చెరువు వద్ద వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటిలో మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
News September 17, 2025
నర్సంపేట: నేషనల్ స్పేస్ సొసైటీలో నిహారిక ఫస్ట్..!

నర్సంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న భూక్య నిహారిక నేషనల్ స్పేస్ సొసైటీ (USA) నిర్వహించిన “Road Map to Space Art Contest” డ్రాయింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా నర్సంపేట MLA దొంతి మాధవ రెడ్డి భూక్య నిహారికను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
News September 17, 2025
WGL: పసుపు క్వింటా రూ.10,555

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పలు రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,530 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.,4500 ధర పలికింది. అలాగే మక్కలు (బిల్టీ)కి రూ.2,300 ధర వచ్చింది. మరో వైపు దీపిక మిర్చి క్వింటా రూ.14 వేలు, పసుపు రూ.10,555 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.