News February 11, 2025

వరంగల్ నుంచి విద్యార్థులతో ట్రైన్లో చెన్నై వెళ్లనున్న రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్‌కు అకస్మికంగా రానున్న విషయం తెలిసిందే. HNKలోని సుప్రభా హోటల్‌లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. విద్యార్థులతో కలిసి ఢిల్లీ నుంచి వస్తున్న ఆయన.. రాత్రి 7:30కు WGL నుంచి చెన్నైకు రైలులో వెళ్లనున్నారు. సాయంత్రం హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరుకొని ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం అవుతారని పార్టీ నేతలు తెలిపారు.

Similar News

News December 9, 2025

మొదటి దశ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మొదటి దశలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియను మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది.157 గ్రామ పంచాయతీలు, 1444 వార్డుల్లో ఎన్నికల విధులకు అవసరమైన 1457 టీములను ఆయా గ్రామ పంచాయతీలకు నియమించారు.

News December 9, 2025

పోలింగ్ సిబ్బందికి మూడో ర్యాండమైజేషన్ పూర్తి

image

భూపాలపల్లి డివిజన్ పరిధి గణపురం, రేగొండ, కొత్తపల్లి గోరి, మొగుళ్లపల్లి మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్‌ను పూర్తి చేశారు. 73 గ్రామ పంచాయతీల్లోని 559 వార్డులకు విధులు నిర్వర్తించే 855 ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), 1084 మంది ఓపీఓలకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం టీ పోల్ పోర్టల్ ద్వారా మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.

News December 9, 2025

ASF: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి

image

GP మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా జరిగే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం HYDలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఎన్నికల సంఘం కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ASF జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఓటర్ల ప్రభావిత అంశాలను అరికట్టడంపై సమీక్ష నిర్వహించారు.