News May 25, 2024

వరంగల్: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు 3 రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రచారం చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రేమేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డిలు వరంగల్ జిల్లాకు చెందిన వారే కాగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న నల్గొండ జిల్లాకు చెందిన వారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో వరంగల్ గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది.

Similar News

News March 14, 2025

రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

image

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.

News March 14, 2025

వరంగల్: నగర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మేయర్  

image

హోలీ పండుగ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రత్యేకంగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను ఆనందంతో సంతోషంగా జరుపుకోవాలని మేయర్ ఆకాంక్షించారు. 

News March 14, 2025

వరంగల్: హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద జిల్లా ప్రజలకు హోలీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందర్నీ ఒకటి చేసే ఈ హోలీ పండుగ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషంతో వెలుగులో నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనంద ఉత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని అన్నారు. సహజ రంగులను వినియోగిస్తూ సాంప్రదాయబద్ధంగా పోలి నిర్మించుకోవాలని కలెక్టర్ కోరారు. 

error: Content is protected !!