News February 16, 2025
వరంగల్: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి ఆదేశించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పరీక్షలను సజావుగా నిర్వహించాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 9,237 మంది విద్యార్థులు హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు.
Similar News
News April 10, 2026
వరంగల్: అంగన్వాడీల్లో ‘తొలిముద్ద’తో పోషకాహారం

జిల్లాలో అంగన్వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ‘తొలిముద్ద’ పథకాన్ని ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లా వ్యాప్తంగా 919 కేంద్రాల్లో అమలు చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, 47,548 మంది చిన్నారులకు బ్రేక్ఫాస్ట్తో పాటు పౌష్టికాహారం అందించనున్నారు. ఉదయం అల్పాహారం లేక ఇబ్బంది పడుతున్న చిన్నారులకు ఈ పథకం ఉపశమనంగా మారనుంది.
News April 9, 2026
వరంగల్: యువతి అనుమానస్పద మృతి..!

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ తండాలో అనుమానస్పదంగా యువతి మృతి చెందింది. తండాకు చెందిన ఓ యువతి ఉరి వేసుకొని ఇంట్లో కనిపించింది. ప్రేమ పేరుతో పర్వతగిరి మండలం రావూరు తండాకు చెందిన నలుగురు యువకులు వేధించి రేప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
News April 9, 2026
ఎయిడ్స్పై అవగాహన కల్పించాలి: వరంగల్ కలెక్టర్

ఎయిడ్స్పై సమాజంలో సరైన అవగాహన కల్పించడం అత్యంత కీలకమని కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ప్రజాపాలన-పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం KMC నుంచి MGM వరకు నిర్వహించిన “AIDS Awareness & Prevention Campaign Day” ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఎంజీఎం కూడలిలో నిర్వహించిన మానవహారంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.


