News October 8, 2024

వరంగల్: పతనమవుతున్న మొక్కజొన్న ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 40 రోజుల క్రితం వరకు మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు ధరలు నమోదు చేసిన మొక్కజొన్న.. గత కొద్దిరోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతంలో రూ.3వేలకు పైగా పలికిన క్వింటా మక్కలు(బిల్టి) ధర క్రమంగా పతనమై వస్తూ నేడు రూ.2430కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News October 8, 2024

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పలు రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ రూ.6100 ధర పలకగా, పచ్చి పల్లికాయ ధర రూ.4,000 పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి రూ. 14వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా ఫలితాలను గత వారంతో పోలిస్తే నేడు స్వల్పంగా పెరిగినట్లు రైతులు పేర్కొన్నారు.

News October 8, 2024

గౌరవ వందనం స్వీకరించిన మంత్రి కొండా సురేఖ

image

జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కొండా సురేఖకు స్థానిక కలెక్టర్ సంతోశ్, ఎస్పీ శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండా సురేఖ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కాసేపు ప్రజాప్రతినిధులతో మంత్రి కొండా సురేఖ చర్చించారు.

News October 8, 2024

వరంగల్ మార్కెట్‌కు వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్ణవమి, 12న విజయదశమి, వారంతపు యార్డు బంద్, 13న ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.