News August 21, 2024
వరంగల్: పత్తి క్వింటా రూ.7,500

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులుగా పత్తి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,370 ఉండగా.. నేడు రూ.130 పెరిగి రూ.7,500 పలికింది. రెండు నెలల వ్యవధిలో ఇంత ధర రావడం ఇదే మొదటిసారి. రెండు రోజులుగా పత్తి ధరలు పెరుగుతుండడం అన్నదాతలకు కొంత ఉపశమనం కలిగించే విషయం.
Similar News
News December 29, 2025
వరంగల్: యూరియా యాప్ డౌన్..!

జిల్లా రైతులకు యూరియా యాప్ సరిగా పని చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాప్ ఓపెన్, డేటా లోడ్ కాకపోవడంతో యూరియా నమోదు, స్లిప్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఈ సమస్య వల్ల ఎరువుల పంపిణీ ఆలస్యం అవుతుండటంతో రైతులు అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News December 29, 2025
WGL: యూరియాకు క్యూలైన్లు.. యాప్తో బుకింగ్ ముద్దు.!

వరంగల్ జిల్లాలో సోమవారం నుంచి యూరియా యాప్ అమలులోకి రానుంది. రైతులు ప్లే స్టోర్లో “Fertilizer Booking App” డౌన్లోడ్ చేసుకుని, తమ పంట వివరాలను నమోదు చేయడంతో యూరియాను బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ సత్య శారద తెలిపారు. బుకింగ్ చేసుకున్నాక, వచ్చే ఐడీ 24 గంటల వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుందన్నారు. ఈ ప్రక్రియపై రైతులకు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆమె ఆదేశించారు.
News December 29, 2025
WGL: యూరియాకు క్యూలైన్లు.. యాప్తో బుకింగ్ ముద్దు.!

వరంగల్ జిల్లాలో సోమవారం నుంచి యూరియా యాప్ అమలులోకి రానుంది. రైతులు ప్లే స్టోర్లో “Fertilizer Booking App” డౌన్లోడ్ చేసుకుని, తమ పంట వివరాలను నమోదు చేయడంతో యూరియాను బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ సత్య శారద తెలిపారు. బుకింగ్ చేసుకున్నాక, వచ్చే ఐడీ 24 గంటల వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుందన్నారు. ఈ ప్రక్రియపై రైతులకు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆమె ఆదేశించారు.


