News January 31, 2025
వరంగల్: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 3,474 మంది విద్యార్థులను గాను రూ.19,80,180 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News November 2, 2025
వరంగల్: కబ్జాలతో కష్టాలు

వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. దీనికి ప్రధాన కారణం వర్షం కాదని, నాలాలు, కాలువలు, చెరువులపై జరుగుతున్న ఆక్రమణలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు నగరానికి అందాన్ని తెచ్చిన 170కి పైగా చెరువులు, కుంటలు ఇప్పుడు అర్ధభాగం వరకు మాయం అయ్యాయని, మురికి కాలువలపై కొందరు అక్రమార్కులు భవనాలు, షాపులు నిర్మించుకుని ప్రజా భద్రతను సవాల్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
News November 2, 2025
వరంగల్: హైదరాబాద్ బయలుదేరిన బీసీ సంఘం నేతలు

హైదరాబాద్లో జరగనున్న బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి వరంగల్ జిల్లాలోని బీసీ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బయలుదేరారు. వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బీసీ జేఏసీ ఛైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. బీసీ హక్కుల సాధన కోసం రాష్ట్ర స్థాయిలో ఐక్యత అత్యవసరమన్నారు. ఈ సమావేశం చారిత్రాత్మకంగా నిలవబోతుందని పేర్కొన్నారు.
News November 1, 2025
వరంగల్: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు!

ఆవుకు ఒకేసారి మూడు దూడలు జన్మించిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. అయితే, కృతిమ గర్భం ద్వారా మేలు జాతి రకాలైన దూడలు జన్మిస్తాయని, కృత్రిమ ఏఐ ద్వారా ఈ దూడలు జన్మించాయని గోపాల మిత్ర డా.అక్బర్ పాషా తెలిపారు. దీంతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు.


