News December 18, 2024
వరంగల్: పెరిగిన కొత్త తేజ మిర్చి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కొత్త తేజ మిర్చి ధర ఈరోజు పెరిగింది. సోమవారం క్వింటా కొత్త తేజ మిర్చి ధర రూ.15,516 ధర పలికింది. ఈరోజు మళ్లీ తగ్గి మంగళవారం రూ. 15,500 అయిందని వ్యాపారులు తెలిపారు. అయితే గత రెండు రోజులతో పోలిస్తే మిర్చి ధర ఈరోజు పెరిగింది. నేడు క్వింటా కొత్త మిర్చి ధర రూ.15,800కి చేరిందని చెప్పారు.
Similar News
News January 26, 2025
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి కొండా
WGLలోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఆయా శాఖలు అధికారులను ఫోన్లలో సంప్రదించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. సులువుగా పరిష్కరించాల్సిన సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను మందలించారు. మరోసారి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
News January 26, 2025
WGL: స్వచ్ఛ సర్వేక్షన్ అవగాహన కార్యక్రమం
వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో శనివారం స్వచ్ఛ సర్వేక్షన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు కమ్యూనిటీ ఆర్గనైజర్లు జవాన్లతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే పాల్గొన్నారు. స్వచ్ఛ టూల్కిట్ ను సమర్థవంతంగా నిర్వహించుటకు వారు తగు సూచనలు చేశారు.
News January 25, 2025
మరియపురం: పథకానికి అనర్హుడినని ముందుకొచ్చిన వ్యక్తికి సన్మానం
గీసుగొండ మండలం మరియపురం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అర్హుల జాబితాను చదవగా అందులో పేరు వచ్చిన గొలమారి జ్యోజిరెడ్డి అనే వ్యక్తి ఆ పథకానికి తాను అనర్హుడనని, ఆ పథకం తనకు వద్దని ముందుకు రాగా మండల ప్రత్యేక అధికారి డి.సురేష్, తహశీల్దార్ ఎండీ రియాజుద్దీన్ అతడిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.