News August 9, 2024

వరంగల్: పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు పత్తి ధరలు రైతన్నలకు స్వల్ప ఊరటనిచ్చాయి. 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు పెరిగాయి. సోమవారం రూ.7,160 పలికిన పత్తి.. మంగళవారం, బుధవారం రూ.7,100, గురువారం మరింత తగ్గి రూ.7055కి చేరింది. ఐతే ఈరోజు రూ.7,130కి పెరిగింది. దీంతో అన్నదాతలకు కొంత ఉపశమనం కలిగినట్లు అయింది.

Similar News

News November 10, 2025

సమగ్ర అభివృద్ధి కోసం పని చేయాలి: కలెక్టర్

image

వరంగల్ కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన డీఆర్డీఏ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి శాఖ తమ ప్రణాళికలను సమయపాలనతో అమలు చేస్తేనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలపడుతుందని సూచించారు.

News November 10, 2025

పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై మంత్రుల సమీక్ష

image

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణతో పాటు పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. రైతులకు మద్దతు ధర అందేలా, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News November 10, 2025

వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

image

వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రజల నుంచి వివిధ వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విన్న కలెక్టర్ సంబంధిత శాఖాధికారులను పిలిపించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల అర్జీలకు తక్షణ స్పందనతో వ్యవహరించడం ప్రజల్లో సంతృప్తిని కలిగించింది.