News February 19, 2025
వరంగల్: పెరిగిన మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి బుధవారం మొక్కజొన్న తరలి రాగా ధర భారీగా పెరిగింది. మంగళవారం మక్కలు(బిల్టీ)కి రూ.2,311 ధర రాగా నేడు రూ.2365 పలికిందని వ్యాపారులు తెలిపారు. ఒక రోజు వ్యవధిలోనే రూ.54 ధర పెరగడం రైతులకు కొంత ఉపశమనం కలిగించినట్టయింది. ధర మరింత పెరగాలని మొక్కజొన్న పండించిన రైతులు కోరుతున్నారు.
Similar News
News December 9, 2025
JMKT: గత వారం లాగానే నిలకడగా పత్తి ధర

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్కు రైతులు 68 వాహనాల్లో 546 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.7,300, కనిష్టంగా రూ.6,600 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. మార్కెట్లో కార్యకలాపాలను చైర్ పర్సన్ స్వప్న పరిశీలించారు. పత్తి ధర శుక్రవారం లాగానే నిలకడగానే కొనసాగింది.
News December 9, 2025
మెదక్: గ్రామాల్లో.. వాట్సప్ ప్రచారాలు

పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ఆధునిక పరిజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు అభ్యర్థులు వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో.. ప్రచారాలను విస్తృతం చేశారు. తమ అనుచరులతో ప్రచార వీడియోలు సైతం తీయించి.. వాటికి సాంగ్స్ క్రియేట్ చేసి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు.
News December 9, 2025
అమరావతిలో రూపుదిద్దుకుంటున్న AIS సెక్రటరీల బంగ్లాలు

అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనికి ఉదాహరణ ఇప్పటికే అమరావతి ప్రాంతంలోని
రాయపూడి వద్ద నిర్మాణంలో ఉన్న AIS సెక్రటరీల బంగ్లాలు రూపుదిద్దుకోవడం. మొత్తం 90 బంగ్లాలు వస్తున్నాయి. వీటిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ వైపు రాత్రింబవళ్లు ఐకానిక్ టవర్ల వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి.


