News February 19, 2025
వరంగల్: పెరిగిన మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి బుధవారం మొక్కజొన్న తరలి రాగా ధర భారీగా పెరిగింది. మంగళవారం మక్కలు(బిల్టీ)కి రూ.2,311 ధర రాగా నేడు రూ.2365 పలికిందని వ్యాపారులు తెలిపారు. ఒక రోజు వ్యవధిలోనే రూ.54 ధర పెరగడం రైతులకు కొంత ఉపశమనం కలిగించినట్టయింది. ధర మరింత పెరగాలని మొక్కజొన్న పండించిన రైతులు కోరుతున్నారు.
Similar News
News November 24, 2025
భక్తులకు ద్రోహం చేశారు: పవన్ కళ్యాణ్

AP: 2019-24 మధ్య తిరుమలకు వెళ్లిన భక్తులను మోసం చేశారని Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఐదేళ్లలో 20కోట్లకు పైగా కల్తీ లడ్డూలు తయారు చేశారని సిట్ తేల్చిందన్న కథనాలపై ఆయన స్పందించారు. ‘గత TTD బోర్డులోని అధికారులు భక్తులకు ద్రోహం చేశారు. మనం భక్తితో నమస్కరిస్తుంటే, వాళ్లు మన హృదయాలను ముక్కలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, మనం పెట్టుకున్న నమ్మకాన్ని కూడా తుంచేశారు’ అని ట్వీట్ చేశారు.
News November 24, 2025
వేములవాడలో ప్రచార రథం వద్ద కొనసాగుతున్న దర్శనాలు

వేములవాడ రాజన్న క్షేత్రంలో ఆలయం ముందు భాగంలోని ప్రచార రథం వద్ద భక్తులు రాజన్నను దర్శించుకుంటున్నారు. ప్రచార రథంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రధాన ఆలయంలో అర్చకులు నిర్వహిస్తున్న స్వామివారి నిత్య కైంకర్యాలను ఎల్ఈడి స్క్రీన్ పై వీక్షించి తరిస్తున్నారు.
News November 24, 2025
శబరిమల యాత్రకు మంథని డిపో నుంచి ప్రత్యేక బస్సు

శబరిమల భక్తుల కోసం మంథని డిపో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు DM శ్రావణ్కుమార్ తెలిపారు. వెళ్లేటప్పుడు మంథని-హైదరాబాద్-శ్రీశైలం-మహానంది-కాణిపాకం-పంబ, తిరుగు ప్రయాణంలో మదురై-రామేశ్వరం-తిరుపతి మార్గంగా బస్సు నడుస్తుంది. చార్జీ ₹6900. బార్డర్ ట్యాక్స్, పార్కింగ్ ఫీజులు ప్రయాణికులే చెల్లించాలి. 35 సీట్లు బుక్ చేసిన గ్రూపులకు 5మందికి ఉచిత ప్రయాణం. బుకింగ్కు: 9959225923, 9948671514


