News January 30, 2025

వరంగల్ పోలీస్ కమిషరేట్ అధికారులతో సమావేశం అయిన అడిషనల్ డీజీపీ

image

వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వచ్చిన అడిషనల్ డీజీపీ స్వాతి లాక్రా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. కాగా, ముందుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ కమిషనరేట్‌ విభాగం పనీతీరును, శాంతి భద్రత నియంత్రణలో భాగంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా అడిషినల్‌ డీజీపీ వివరించారు.

Similar News

News February 11, 2025

అయిజ: గుండెపోటుతో RMP వైద్యుడు మృతి

image

అయిజ మండలంలో గుండెపోటుతో RMP వైద్యుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాపురం స్టేజీలో కొన్నేళ్లుగా వెంకట్రాముడు అనే వ్యక్తి RMP వైద్యుడిగా పని చేస్తున్నాడు. కాగా నేడు సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. వైద్యుడి మృతితో పలు గ్రామాల ప్రజలు విచారణ వ్యక్తం చేశారు.

News February 11, 2025

శివరాత్రి సందర్భంగా అధికారులతో మంత్రి సురేఖ సమీక్ష

image

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈఓలతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. గతేడాది నిర్వహణ అనుభవాల ఆధారంగా ఈసారి చర్యలు చేపట్టాలన్నారు.

News February 11, 2025

జేఈఈ మెయిన్-2025 ఆలిండియా టాపర్‌గా భాష్యం విద్యార్థిని

image

జేఈఈ మెయిన్-2025 జనవరి ఫలితాలలో భాష్యం అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. సెషన్-1 ఫలితాలలో భాష్యం విద్యార్థి గుత్తికొండ సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించిన ఏకైక తెలుగు విద్యార్థిగా నిలిచింది. మరెంతో మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. భాష్యం ప్రత్యేక కరికులంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలుయజేస్తూ.. విద్యార్థులను, అధ్యాపకులను సంస్థ యాజమాన్యం అభినందించింది.

error: Content is protected !!