News February 5, 2025
వరంగల్: ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతర విద్యుత్: కలెక్టర్

రాబోయే వేసవిలో ప్రభుత్వ ఆసుపత్రులలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఎన్పీడీసీఎల్, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు.
Similar News
News February 9, 2025
నేడు బీఆర్ఎస్ ‘బీసీ’ సమావేశం

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై ఇవాళ బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ ‘బీసీ’ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో జరిగే ఈ భేటీలో కులగణన సర్వే నివేదిక, 42% రిజర్వేషన్ అమలుతో పాటు ఇతర సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
News February 9, 2025
ఆదిలాబాద్: ఇద్దరు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ సునీల్ వివరాల ప్రకారం.. స్థానిక సీసీఐ ఫ్యాక్టరీ వద్ద శనివారం వాహనాల తనిఖీ చేస్తున్న సందర్భంగా రెండు ద్విచక్రవాహనాలపై అనుమానాస్పదంగా వెళుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రదీప్, జగేశ్వర్ ను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. చోరీ చేసినట్లు అంగీకరించారన్నారు. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
News February 9, 2025
ఆదిలాబాద్: మహిళలకు GOOD NEWS.. 11న జాబ్ మేళా

ఆదిలాబాద్ లోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11 TASK ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన GLITZ CORP ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.అతీక్ బేగం పేర్కొన్నారు. 10, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకున్న మహిళ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15వేల జీతంతో పాటు, భోజనం, రవాణా సౌకర్యం, వసతి నెలకు అలవెన్స్ ఉంటుందన్నారు.