News February 3, 2025

వరంగల్: ప్రారంభమైన మార్కెట్.. తరలివచ్చిన పత్తి 

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం తాము ఊహించిన విధంగా రాలేదని రైతులు నిరాశ చెందుతున్నారు. 15 రోజుల క్రితం రూ.7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది. నేడు మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.7,000 పలికినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు.

Similar News

News January 5, 2026

సూసైడ్‌కు యత్నం.. కాపాడిన వరంగల్ పోలీసులు

image

వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి రైలు పట్టాలపై దేశాయిపేట ప్రాంతానికి చెందిన మంద వినోద్ అన్న యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడగా మిల్స్ కాలనీ కానిస్టేబుళ్లు కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి, రాధిక అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా యువకుడు పట్టాలపై పడుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News January 5, 2026

వరంగల్‌ ప్రజావాణిలో 151 దరఖాస్తుల స్వీకరణ

image

వరంగల్‌ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 151 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 59 దరఖాస్తులు కాగా, జీడబ్ల్యూఎంసీ (GWMC)కు 20, డీఆర్‌డీఓ, డీపీఓ శాఖలకు చెరో 11 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మిగతా వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు 50 ఉన్నట్లు వెల్లడించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

News January 5, 2026

WGL: కొండాపురంలో రైతు హత్య?

image

రాయపర్తి మండలం కొండాపురంలో రైతు కొండ వీరస్వామి (60) తన వ్యవసాయ క్షేత్రం వద్ద అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. తలపై గాయాలతో పడి ఉన్న వీరస్వామి మృతదేహాన్ని గొర్రెలు కాపరులు గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.