News March 9, 2025
వరంగల్ బల్దియాలో మహిళా దినోత్సవ వేడుకలు

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమిషనర్ అశ్విని తానాజీ వాకర్డే, మేయర్ గుండు సుధారాణి, మహిళా కార్పొరేటర్లు కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. కార్పొరేషన్లో ప్రముఖ పాత్ర పోషించే శానిటేషన్ సిబ్బందిలో మహిళలే ఎక్కువగా ఉన్నారన్నారు.
Similar News
News November 18, 2025
కరీంనగర్: సురేందర్ రెడ్డికి నేతల నివాళులు..!

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి <<18317220>>బండ సురేందర్ రెడ్డి <<>>గుండెపోటుతో నిన్న రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పెద్దపల్లి MLA చింతకుంట విజయరమణా రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి KNRలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అంకితభావంతో పనిచేస్తూ అందరితో కలివిడిగా ఉండే సురేందర్ మృతి చెందడం బాధాకరమని వారన్నారు. సురేందర్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News November 18, 2025
కరీంనగర్: సురేందర్ రెడ్డికి నేతల నివాళులు..!

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి <<18317220>>బండ సురేందర్ రెడ్డి <<>>గుండెపోటుతో నిన్న రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పెద్దపల్లి MLA చింతకుంట విజయరమణా రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి KNRలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అంకితభావంతో పనిచేస్తూ అందరితో కలివిడిగా ఉండే సురేందర్ మృతి చెందడం బాధాకరమని వారన్నారు. సురేందర్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News November 18, 2025
మచిలీపట్నంలో మరో ప్రాజెక్ట్కు ఒప్పందం

మచిలీపట్నంకు మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. రూ.6500 కోట్లతో గోవా షిప్ యార్డ్ నిర్మాణం జరగనుంది. ఇటీవల విశాఖలో జరిగిన CII సదస్సులో గోవా షిప్ యార్డ్ సంస్థ ప్రభుత్వంతో MOU చేసుకుంది. గోవా షిప్ యార్డ్ నిర్మాణం ద్వారా 6వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మచిలీపట్నంలో ఇప్పటికే పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గోవా షిప్ యార్డ్ నిర్మాణం కూడా జరిగితే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టినట్టే.


