News March 12, 2025
వరంగల్: బల్దియా పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం

కరీంనగర్లోనే లోయర్ మానేరు డాం వద్ద 33/11 కెవి సబ్ స్టేషన్ వార్షిక నిర్వహణ పనులు కొనసాగుతున్నందున నేడు ఉదయం 8గంటల నుంచి 6గంటల వరకు నీటి సరఫరా జరగదని మున్సిపల్ అధికారులు తెలిపారు. వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతం, మడికొండ, కడిపికొండ బట్టుపల్లి రాంపూర్ ఎల్లాపూర్ నేటి సరఫరా జరగదని పేర్కొన్నారు. ఇట్టి ప్రాంతవాసులు గమనించి సహకరించాలని ఎస్సీ ప్రవీణ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News November 20, 2025
వరంగల్: ‘బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను అందజేయాలి’

బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను అందజేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్పై సమావేశంలో కోరారు. 2002 ఓటర్ల జాబితాను ప్రస్తుతం ఉన్న జాబితాతో సరిపోల్చుతున్నట్టు తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు, వివరాల సవరణలు జరగనున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు, జెడ్పీ సీఈఓ రామీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News November 20, 2025
సీఎం సహాయనిది పేదలకు ఒక వరం: ఎంపీ కావ్య

అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిది ఒక వరమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఎంపీ CMRF చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 11 మందికి రూ.6 లక్షల 25 వేల విలువైన చెక్కులను అందజేశారు.
News November 19, 2025
వరంగల్ కలెక్టర్కు మంత్రి పొంగులేటి అభినందనలు

జల సంరక్షణ కేటగిరీ-2లో వరంగల్ జిల్లా అవార్డు సాధించి, ఢిల్లీలో అవార్డు స్వీకరించిన నేపథ్యంలో, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ఐఏఎస్ను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ మంత్రితో కాసేపు చర్చించారు.


