News March 12, 2025
వరంగల్: బల్దియా పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం

కరీంనగర్లోనే లోయర్ మానేరు డాం వద్ద 33/11 కెవి సబ్ స్టేషన్ వార్షిక నిర్వహణ పనులు కొనసాగుతున్నందున నేడు ఉదయం 8గంటల నుంచి 6గంటల వరకు నీటి సరఫరా జరగదని మున్సిపల్ అధికారులు తెలిపారు. వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతం, మడికొండ, కడిపికొండ బట్టుపల్లి రాంపూర్ ఎల్లాపూర్ నేటి సరఫరా జరగదని పేర్కొన్నారు. ఇట్టి ప్రాంతవాసులు గమనించి సహకరించాలని ఎస్సీ ప్రవీణ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News March 16, 2025
వరంగల్ అమ్మాయితో అమెరికా అబ్బాయి మ్యారేజ్❤️

వరంగల్కు చెందిన అమ్మాయితో అమెరికాకు చెందిన అబ్బాయికి ఆదివారం పెళ్లి జరగనుంది. కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ సంపత్- పద్మ దంపతుల రెండో కూతురు సుప్రియ ఐదేళ్ల క్రితం పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. అదే కాలేజీలో చదువుతున్న గ్రాండ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో గ్రాండ్ తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. వీరి పెళ్లి వరంగల్లో నేడు జరగనుంది.
News March 16, 2025
వరంగల్: రైలు కింద పడి వ్యక్తి మృతి

వ్యవసాయ పనులు చేసుకుని వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. శాయంపేట గ్రామానికి చెందిన రాజేందర్ (33) చింతలపల్లి రైల్వే స్టేషన్ పక్కన గల మొక్కజొన్న చేనుకు వద్దకు వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. శవపరీక్ష అనంతరం శవాన్ని మృతుడి తండ్రి ఐలయ్యకు అప్పగించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.
News March 16, 2025
ఈవీఎం మిషన్లు తనిఖీలు చేసిన వరంగల్ కలెక్టర్

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా వేర్ హౌస్ గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలెక్టర్ సత్య శారదా దేవి వివిధ పార్టీ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి తనిఖీలు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.