News February 28, 2025
వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీసీ ఘోష్ ఈరోజు సతీసమేతంగా వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పూజారులు న్యాయమూర్తికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలను న్యాయమూర్తికి అందజేసి ఆశీర్వచనాలు చేశారు. న్యాయమూర్తి వెంట మట్టేవాడ ఇన్స్పెక్టర్ గోపి ఉన్నారు.
Similar News
News December 9, 2025
పాకిస్థాన్కు మరిన్ని నిధులు ఇచ్చిన IMF

దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. తాజాగా 1.2 బిలియన్ డాలర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్కు ఇప్పటివరకు వచ్చిన మొత్తం నిధులు సుమారు 3.3B డాలర్లకు చేరాయి. ఆ దేశం గత కొన్నేళ్లుగా ఎక్కువగా బయటనుంచి వచ్చే <<16600466>>ఆర్థిక సాయం<<>>పైనే ఆధారపడుతోంది. 2023లో త్రుటిలో డిఫాల్ట్ను తప్పించుకుంది.
News December 9, 2025
ముదిగొండ: కోతులు, కుక్కల బెడద నివారించేవారికే ఓటు!

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముదిగొండలో యువకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థికే తమ ఓటు వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారినే గెలిపిస్తామని యువకులు స్పష్టం చేశారు. వారి ఈ నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
News December 9, 2025
హైదరాబాద్లోని NI-MSMEలో ఉద్యోగాలు..

HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్(NI-<


