News May 25, 2024
వరంగల్: భద్రకాళి చెరువుతో పొంచి ఉన్న ప్రమాదం

WGL- HNK ప్రాంతాల మధ్య భద్రకాళి చెరువు ఉంది. 15 ఏళ్లుగా వరదతో పది కాలనీలు నీట మునుగుతున్నాయి. స్మార్ట్ సిటీ పథకం ద్వారా భద్రకాళి బండ్ పనులు మూడేళ్లుగా సాగుతున్నాయి. దీంతో చెరువు కట్ట బలహీనమైంది. గతేడాది పోతననగర్ వైపు మట్టి కట్టకు గండి పడింది. ఇరిగేషన్, గ్రేటర్ WGL అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే పలు ప్రాంతాలు నీట మునిగే అవకాశాలున్నాయని స్థానికులు వాపోతున్నారు.
Similar News
News February 10, 2025
గీసుగొండలో గంజాయి చాక్లెట్ల కలకలం..

గీసుగొండ మండలంలో గంజాయి చాక్లెట్ల వార్త కలకలం రేపింది. సీఐ మహేందర్ తెలిపిన వివరాలిలా.. టెక్స్టైల్ పార్కులో పనిచేస్తున్న ముగ్గురు యువకుల వద్ద గంజాయి చాక్లెట్లు ఉన్నాయని సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ముగ్గురు యువకులు పారిపోవడానికి యత్నించారు. వారిని వెంబడించి పట్టుకోగా 12 గంజాయి చాక్లెట్లు లభించాయన్నారు. వారిని కస్టడీలోకి తీసుకున్నామని CI తెలిపారు.
News February 10, 2025
హనుమకొండ: ఐనవోలులో లేగలపై హైనాల దాడి

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పరిధి గరిమెళ్లపల్లి గ్రామంలో రాత్రి హైనాలు దాడి చేసి మూగజీవాలను చంపాయి. స్థానికుల కథనం ప్రకారం.. సుమారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గ్రామంలోకి హైనాలు చొరబడి పాకలో ఉన్న లేగలను చంపాయి. శనివారం చర్ల అజయ్ కుమార్ లేగను, ఆదివారం రాత్రి రాజారపు పోశాలు పాకలో ఉన్న లేగలపై దాడి చేసి చంపాయిని స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 10, 2025
వరంగల్: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో పంచాయతీ రాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. ఇంటి నిర్మాణం కోసం వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా సమాచారంతో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.