News February 16, 2025

వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

image

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 13, 2025

కొలనుపాక: గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థి సన్మానం

image

కొలనుపాకలో ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ సర్పంచిగా విజయం సాధించారు. అయితే విజయాలు, అపజయాలు సహజమని, గ్రామ అభివృద్ధి ముఖ్యమని భావించిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భీమగాని హేమలత సంతోష్.. యాకమ్మను సన్మానించారు. దీనిపై యాకమ్మ స్పందిస్తూ గ్రామ అభివృద్ధికి ఆమె సలహాలు, సూచనలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

News December 13, 2025

వరంగల్ NIT అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానస్పద మృతి

image

ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి వరంగల్ ఎన్ఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి(43) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 13, 2025

MNCL: జీపీ ఎన్నికలు.. సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు

image

ఈనెల 14న జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంచిర్యాల జిల్లాలలోని బెల్లంపల్లి, కన్నెపల్లి, భీమిని, తాండూర్, నెన్నెల, కాసిపేట, వేమనపల్లి మండలాల్లో 12వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 14న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యే వరకు సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.