News February 16, 2025

వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

image

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 27, 2025

ALERT: నేడు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: రాష్ట్రంలోని 47 మండలాల్లో ఇవాళ తీవ్ర వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం-13, విజయనగరం-14, మన్యం-11, అనకాపల్లి-2, కాకినాడ-4, తూర్పుగోదావరి-2, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. నిన్న YSR కడప జిల్లా సిద్ధవటంలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. కమ్మరచేడులో 40.7, నిండ్రలో 40.1 ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.

News March 27, 2025

చిన్నారిపై అత్యాచార ఘటనపై హోం మంత్రి ఆగ్రహం

image

విశాఖ వన్ టౌన్ పరిధిలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన కీచకుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని మంత్రి ఆదేశించారు. నిందితుడిని గుర్తించినట్లు కమిషనర్ మంత్రికి తెలిపారు.

News March 27, 2025

సంపన్నులు ఇష్టపడే ప్రదేశాలు ఇవే!

image

భారత్‌కు చెందిన 22 శాతం మంది అతి సంపన్నులు విదేశాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నట్లు కోటక్ ప్రైవేట్-ఈవై సర్వేలో తేలింది. ఎక్కువగా US, UK, UAE, కెనడా, ఆస్ట్రేలియాలో నివసించేందుకు ఇష్టపడుతున్నారు. రూ.300 కోట్లకుపైగా ఆస్థి కలిగిన వారు క్వాలిటీ లైఫ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల అక్కడ స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. పిల్లల స్టడీ కోసం కూడా ఆయా దేశాలకు వలస వెళ్లాలని భావిస్తున్నారు.

error: Content is protected !!