News February 16, 2025

వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

image

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 11, 2026

మినిమం డిపాజిట్ చేయకపోతే అకౌంట్లు ఇనాక్టివ్!

image

మార్చి 31తో ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియనుంది. మీ PPF, SSY (సుకన్య సమృద్ధి), NPS ఖాతాలు యాక్టివ్‌గా ఉండాలంటే ఆలోపు కనీస డిపాజిట్లు (PPF-₹500, SSY-₹250, NPS-₹1,000) చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ చేయలేకపోతే ఆ ఖాతాలు ‘ఇనాక్టివ్‌’ స్టేటస్‌లోకి వెళ్తాయి. వీటిని తిరిగి యాక్టివేట్ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మిస్ అవుతారు.

News March 11, 2026

కడప: ఇంటర్ పరీక్షలకు 91% విద్యార్థులు హాజరు..!

image

కడప జిల్లాలో బుధవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ కామర్స్, సోషియాలజీ పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 2,723(91%) మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,987 మంది విద్యార్థులకు గాను.. 2,723 మంది పరీక్షలు రాశారు. జనరల్ విద్యార్థుల్లో 2,207 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 2,083 మంది రాశారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 780 మందికి గాను.. 640 మంది హాజరయ్యారు.

News March 11, 2026

ఆదిలాబాద్ గడ్డపై శంభాజీ మహారాజ్ వీరస్మరణ

image

ఛత్రపతి శంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో ఆయన ధీరత్వాన్ని స్మరించుకున్నారు. మరాఠా సామ్రాజ్య విస్తరణలో భాగంగా శంభాజీ మహారాజ్ దక్కన్ ప్రాంతంలో పర్యటించినట్లు చరిత్ర చెబుతోంది. ADB, నిర్మల్,భైంసా సరిహద్దుల్లో నేటికీ మరాఠా సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. జిల్లాలోని పాత కోట శిథిలాలు, మహోర్ కోట బురుజులు నాటి మరాఠాల వ్యూహాత్మక కట్టడాలకు, శంభాజీ మహారాజ్ అడుగుజాడలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.