News July 31, 2024
వరంగల్: భారీగా పెరిగిన తేజ మిర్చి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే తేజ మిర్చి ధర భారీగా పెరిగింది. నిన్న క్వింటాకు రూ.17,300 పలికిన తేజ మిర్చి నేడు రూ.18,200 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.15,500 రాగా నేడు రూ.15 వేలకు తగ్గింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.15,500 ధర రాగా నేడు రూ. 14 వేల ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News January 24, 2026
వరంగల్ కలెక్టర్కు రాష్ట్రస్థాయి అవార్డు

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపినందుకు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి నిరంతర శిక్షణ, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించినందుకు ఈ గుర్తింపు లభించింది. జనవరి 25న హైదరాబాద్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
News January 23, 2026
వరంగల్ RJDగా లక్ష్మణుడు బాధ్యతల స్వీకరణ

మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్గా హైదరాబాదులో అదనపు డైరెక్టర్గా పనిచేస్తున్న లక్ష్మణుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇక్కడ పనిచేస్తున్న RJD ఉప్పుల శ్రీనివాస్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం లక్ష్మణుడిని వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్గా నియమించిన విషయం తెలిసిందే. వరంగల్ RJDగా బాధ్యతలు తీసుకున్న లక్ష్మణుడికి మార్కెటింగ్ శాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
News January 21, 2026
WGL: ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్లలో సీసీ కెమెరాలు అమర్చి బోర్డు సర్వర్కు అనుసంధానం చేశారు. పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.


