News March 27, 2025
వరంగల్: మరమ్మత్తుల కారణంగా చర్లపల్లి వరకే కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు

కృష్ణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లడం లేదని రైల్వే జీయం అరుణ్ కుమార్ జైన్ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి స్టేషన్ను అభివృద్ధి చేయడంతో పాటు, కొన్ని మరమ్మత్తుల కారణంగా కృష్ణ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి వరకే పరిమితం చేశామని, సికింద్రాబాద్కు పోవు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు గమనించి, సహకరించాల్సిందిగా వారు కోరారు.
Similar News
News January 3, 2026
కాంగ్రెస్ పార్టీతో విజయ్ పొత్తు?

తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన TVK పార్టీ కాంగ్రెస్తో పొత్తు దిశగా అడుగులు వేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ జాతీయ ప్రతినిధి గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. టీవీకే, కాంగ్రెస్ లౌకికవాదానికి కట్టుబడి ఉన్న సహజ భాగస్వాములని ఆయన అన్నారు. ‘‘భవిష్యత్లో ఇరు పార్టీలు కలిసి పనిచేయొచ్చు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దీనికి అడ్డు పడుతుండొచ్చు’’ అని గెరాల్డ్ పేర్కొన్నారు.
News January 3, 2026
పోలవరం: జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు

పోలవరం జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వై.రామవరం మండలంలోని డొంకరాయి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ చరణ్ నాయక్ వాహన తనిఖీలు నిర్వహించారు. రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ శివ కుమార్, జడ్డంగి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ చినబాబు వాహన తనిఖీలు చేసి రికార్డులు సక్రమంగా లేనివారికి జరిమానాలు విధించారు.
News January 3, 2026
మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)లో భాగంగా 2025 ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేసే ప్రక్రియ నిర్వహణ వేగవంతం చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 52 శాతమే పూర్తి చేశారని, ప్రక్రియను మరింత వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలన్నారు.


