News March 27, 2025
వరంగల్: మరమ్మత్తుల కారణంగా చర్లపల్లి వరకే కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు

కృష్ణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లడం లేదని రైల్వే జీయం అరుణ్ కుమార్ జైన్ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి స్టేషన్ను అభివృద్ధి చేయడంతో పాటు, కొన్ని మరమ్మత్తుల కారణంగా కృష్ణ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి వరకే పరిమితం చేశామని, సికింద్రాబాద్కు పోవు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు గమనించి, సహకరించాల్సిందిగా వారు కోరారు.
Similar News
News October 14, 2025
HNK: కటాక్షాపూర్ కాజ్వే నిర్మాణానికి రూ. 15లక్షల మంజూరు: కలెక్టర్

వరంగల్ -ములుగు ప్రధాన రహదారిలో ఉన్న కటాక్షపూర్ కాజ్వే నిర్మాణాన్ని రూ.15లక్షల వ్యయంతో చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కటాక్షపూర్ కాజ్వే నిర్మాణానికి సంబంధించి సాగునీటి పారుదల, జాతీయ రహదారుల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేశ్, డీఈ కిరణ్ పాల్గొన్నారు.
News October 14, 2025
OBC ఆదాయ పరిమితి పెంచమన్న కేంద్రం

OBC రిజర్వేషన్ల కోసం క్రీమీ లేయర్ ఆదాయ పరిమితి పెంచే యోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణంగా నిర్దేశించిన ఆదాయం కంటే ఎక్కువుంటే ప్రభుత్వ విద్య, ఉపాధిలో రిజర్వేషన్లు రావు. ఆఖరిసారి 2017లో రూ.6 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.8 లక్షలకు పెంచింది. ఇప్పటికే 2020, 2023లో పెంపు గడువు ముగిసింది. ఈ లిమిట్ పెంచితే పేద OBC వర్గాలకు రిజర్వేషన్లలో పోటీ కష్టమవుతుందనే కేంద్రం అంగీకరించట్లేదని తెలుస్తోంది.
News October 14, 2025
MHBD: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: రజిత

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఉపాధి అధికారి రజిత అన్నారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. మహబూబాబాద్లోని శ్రీనివాస నర్సరీ, మారుతీ ఆగ్రోటేక్ ఖాళీగానున్న ఫీల్డ్ అడ్వైజరీ, గ్రూప్ లీడర్స్ పోస్టుల భర్తీకి ఈనెల 15న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు అభ్యర్ధులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 18-35 వయసు కలిగిన వారు అర్హులని తెలిపారు.