News March 28, 2025
వరంగల్ మార్కెట్కి వరుసగా నాలుగు రోజులు సెలవులు

వరంగల్ నగరంలోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్కు ప్రభుత్వం వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించింది. ఈ మేరకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు. ఈ సమయంలో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. ఈనెల 29 అమావాస్య బంధు, 30 ఆదివారం, ఉగాది, సోమవారం రంజాన్,31 మంగళవారం రంజాన్ మరుసటి రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించబడింది. తిరిగి మార్కెట్ ఏప్రిల్ 2వ తారీకు ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News December 3, 2025
RGM: మఫ్టీలో షీ టీమ్స్.. ఆకతాయిల ఆటకట్టు

RGM కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రత కోసం షీ టీంలు మఫ్టీలో నిఘా పెంచాయని CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. స్కూల్లు, కాలేజీలు, బస్టాండ్ల వద్ద మహిళలు ఇబ్బందులు పడకుండా పర్యవేక్షిస్తున్నామన్నారు. NOVలో 68 పిటిషన్లు స్వీకరించి, 4 FIRలు, 9 పెట్టీ కేసులు, 28 కౌన్సిలింగ్లు నిర్వహించామన్నారు. డీకాయ్ ఆపరేషన్లలో 60మందిని పట్టుకున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా షీ టీం నంబర్లను సంప్రదించాలన్నారు.
News December 3, 2025
KNR: అభివృద్ధి చేయకపోతే ఏడాదిలో రాజీనామా చేస్తా: అభ్యర్థి

గ్రామాన్ని అభివృద్ధి చేయకపోతే సంవత్సరంలో రాజీనామా చేస్తానని బాండ్ పేపర్పై రాసిచ్చిన వైనం KNR(D) శంకరపట్నం మండలంలో చోటుచేసుకుంది. మం.లోని కేశవపట్నంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన అభ్యర్థి సముద్రాల సంపత్ గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలను తీర్చుతానని లేదంటే రాజీనామా చేస్తానని హామీపత్రం రాసిచ్చాడు. కోతుల సమస్య, ఖబరస్తాన్కి లైటింగ్, ఆటో యూనియన్ సంఘం భవన నిర్మాణం సహా అనేక హామీలను సంపత్ ప్రకటించాడు.
News December 3, 2025
జిల్లాలో 941 సర్పంచ్, 2,927 వార్డు నామినేషన్లు

జగిత్యాల జిల్లాలో రెండో విడతకు సంబంధించి 122 గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.సత్యప్రసాద్ తెలిపారు. సర్పంచ్ స్థానాలకు 941, వార్డు సభ్యుల స్థానాలకు 2,927 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగిందని ఆయన పేర్కొన్నారు.


