News March 28, 2025

వరంగల్ మార్కెట్‌కి వరుసగా నాలుగు రోజులు సెలవులు

image

వరంగల్ నగరంలోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌కు ప్రభుత్వం వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించింది. ఈ మేరకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు. ఈ సమయంలో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. ఈనెల 29 అమావాస్య బంధు, 30 ఆదివారం, ఉగాది, సోమవారం రంజాన్,31 మంగళవారం రంజాన్ మరుసటి రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించబడింది. తిరిగి మార్కెట్ ఏప్రిల్ 2వ తారీకు ప్రారంభమవుతుందన్నారు.

Similar News

News December 2, 2025

మదనపల్లె జిల్లా ప్రకటించినా..!

image

మదనపల్లె జిల్లాపై ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్ హామీ ఇచ్చారు. తాజాగా జిల్లాను ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కూటమి ప్రభుత్వంతోనే జిల్లా సాధ్యమైందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పోస్టర్లు పంచాలని హైకమాండ్ ఆదేశించింది. ఇక్కడ గ్రూపులు, ఖర్చు ఎందుకులే అని నాయకులు ప్రచారం చేయకుండా సైలెంట్ అయ్యారట. నా వల్లే వచ్చిందని MLA, నావల్లే వచ్చిందని మరికొందరు వేర్వేరుగా చెప్పుకోవడం కొసమెరుపు.

News December 2, 2025

HNK: సర్పంచ్ అభ్యర్థి స్వతంత్రంగానే పోటీ చేయాలని తీర్మానం

image

జిల్లాలోని శాయంపేట (M) ప్రగతి సింగారంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలని, పార్టీల మద్దతు తీసుకోవద్దని ఎస్సీ కుల పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సర్పంచ్ స్థానం SCకి రిజర్వ్ అయింది. ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి పాటించాలని, పార్టీలపరంగా పోటీలో ఉండి ఆర్థికంగా నష్టపోవద్దనే ఉద్దేశంతో ఈ తీర్మానం చేశారు. ఈ తీర్మానం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

News December 2, 2025

తిరుపతిలో ముగ్గురి మృతి.. ఏం జరిగిందంటే?

image

తిరుపతిలో ముగ్గురు <<18444073>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. తమిళనాడు గుడియాత్తంకు చెందిన సత్యరాజ్(30) భార్యను వదిలేసి పొంగొటై(21)తో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కుమారుడు మనీశ్(3)తో కలిసి దామినేడుకు వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నాడు. 10రోజుల నుంచి వీళ్లు ఇంటి నుంచి బయటకు రాలేదు. నిన్న రాత్రి వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. రూములో విషం బాటిల్ ఉండటం, సత్యరాజ్ ఉరికి వేలాడుతుండటంతో ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు.