News March 28, 2025
వరంగల్ మార్కెట్కి వరుసగా నాలుగు రోజులు సెలవులు

వరంగల్ నగరంలోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్కు ప్రభుత్వం వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించింది. ఈ మేరకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు. ఈ సమయంలో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. ఈనెల 29 అమావాస్య బంధు, 30 ఆదివారం, ఉగాది, సోమవారం రంజాన్,31 మంగళవారం రంజాన్ మరుసటి రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించబడింది. తిరిగి మార్కెట్ ఏప్రిల్ 2వ తారీకు ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News February 25, 2026
మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుందంటే?

ఎనీమియా రావడానికి ఐరన్ లోపం ప్రధాన కారణం. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి.
News February 25, 2026
డయేరియా, కల్తీ పాల ఘటనలపై సీఎం సమీక్ష

AP: శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాల ఘటనలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒకరు వెంటిలేటర్పై ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. శ్రీకాకుళం ఘటనలో 76 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
News February 25, 2026
నష్టాలు పూడ్చేందుకు మరో సినిమా చేయనున్న ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఉదారతను చాటుకున్నారు. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు భారీ నష్టాలు వాటిల్లాయి. దీంతో ప్రభాస్ స్వయంగా స్పందించి ఆ సంస్థకు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. తన రెమ్యునరేషన్ని భారీగా తగ్గించుకుంటానని చెప్పారట. స్పిరిట్, ఫౌజీ చిత్రాలు పూర్తయ్యాక 2027లో ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు.


