News February 14, 2025
వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే 5,531 మిర్చి రూ.11 వేలు, దీపిక మిర్చి రూ.17,500, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 1048 రకం మిర్చి రూ.11 వేలు, మక్కలు (బిల్టీ) రూ. 2,355, సూక పల్లికాయ రూ.6,500, పచ్చి పల్లికాయకి రూ.4,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News December 27, 2025
WGL: గ్రామ పాలనలో మహిళా శక్తి!

జీపీ ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్తో జిల్లాలో 316 జీపీలకు ఎన్నికలు జరగగా 158 మంది మహిళలు సర్పంచులుగా గెలిచారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళామణులు తమ సత్తా చాటుకున్నారు. ఇక సర్పంచ్ స్థానాల్లో మగవారు నిలిచిన చోట ఉప సర్పంచ్ మహిళలకు, మహిళలు ఉన్న చోట మగవారికి అవకాశం వచ్చింది. పాలనపై పట్టులేకున్నా, కుటుంబ బాధ్యతలతో పాటు గ్రామాభివృద్ధి బాధ్యతను మోస్తామని మహిళా సర్పంచులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News December 26, 2025
WGL: మహిళా సంఘాల ఖాతాల్లో రూ.6.50 కోట్లు జమ

వరంగల్ జిల్లాలో రుణాలు సకాలంలో చెల్లించిన స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించింది. వడ్డీలేని రుణాల పథకం కింద 11 మండలాలకు రూ.6.50 కోట్లు విడుదల చేసి 7,540 సంఘాల ఖాతాల్లో జమ చేసింది. 2025-2028 రుణాలపై ఈ వడ్డీ రాయితీ వర్తించింది. అత్యధికంగా సంగెం మండలానికి రూ.79.52 లక్షలు, అత్యల్పంగా నెక్కొండకు రూ.76,958 లభించింది. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 24, 2025
వర్ధన్నపేట: ఏటీఎంలో కేటుగాడు

వర్ధన్నపేట ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం వద్ద రైతు పిన్నింటి కిషన్రావు మోసానికి గురయ్యాడు. నగదు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో దుండగుడు అతని ఏటీఎం కార్డును మార్చి రూ.40 వేల నగదు కాజేశాడు. గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మోసగాడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


